నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె -ఫిబ్రవరి 28 ః తంబళ్లపల్లె మండలం లోని 21 పంచాయతీలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో 93.44% పూర్తయినట్లు ఏవో థామస్ రాజా విలేకరులకు తెలిపారు. ఉదయం ఆయన తంబళ్లపల్లె క్రాస్ రోడ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేపట్టారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు, అధికార కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News