నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 28 : తంబళ్లపల్లె మండలం లోని 21 పంచాయతీల విద్యుత్ బకాయిలు చెల్లింపుకు సహకరించాలని ఎంపీడీవో ఉషారాణిని విద్యుత్ శాఖ ఎఈ సురేంద్ర కోరారు. మంగళవారం ఆయన ఎంపీడీవో తో సమావేశమై పంచాయతీలలో తాగునీటి సరఫరా విద్యుత్ మోటర్ల బిల్లులు, వీధిలైట్లు బిల్లులు పేరుకుపోయినట్లు సూచించారు. భవిష్యత్తులో ప్రీపెయిడ్ మీటర్లు బిగించి డైరెక్టుగా కార్యాలయం బిల్లులు చెల్లింపు సులువుగా ఉంటుందన్నారు. ఇకపై విద్యుత్ బిల్లులు లబ్ధిదారులు కార్యాలయం చుట్టూ తిరిగే పని లేకుండా డిజిటల్ పేమెంట్ చేయడానికి సహకరించాలన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్తు కనెక్షన్ తో లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపు లేకుండా ఆదాయ వనరు గా మారుతుందని ఇందుకు మండల పరిషత్ అధికారులు సహకరించేలా కృషి చేయాలన్నారు. ఎంపీడీవో ఉషారాణి స్పందించి పంచాయతీల బిల్లు చెల్లింపుకు సహకరిస్తామని అదేవిధంగా సోలార్ విద్యుత్తు పై గ్రామాల్లో అవగాహనకు సచివాలయ సిబ్బందికి సూచనలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏవో థామస్ రాజా, లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్లు శంకర, ఇంతియాజ్, సీనియర్ అసిస్టెంట్ శివ మూర్తి పాల్గొన్నారు
Reporter
Namitha News