Monday, 14 September 2026 10:08:48 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

విద్యాశాఖ నిర్ణయం ప్రైవేట్ పాఠశాలలకి ఇబ్బందికరం

హైకోర్టు ఆదేశాలను ధిక్కరించడం సబబు కాదు - ఎంఈఓకి పలువురు కరస్పాండెంట్ల వినతి

Date : 14 May 2026 03:00 PM Views : 165

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విద్యాశాఖ నిర్ణయం ప్రైవేట్ పాఠశాలలకి ఇబ్బందికరం - హైకోర్టు ఆదేశాలను ధిక్కరించడం సబబు కాదు - ఎంఈఓకి పలువురు కరస్పాండెంట్ల వినతి మదనపల్లె : ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఆయా పాఠశాలల కరస్పాండెంట్ల ప్రమేయం లేకుండా యుడైస్ నందు తొలగించడం,టీసిలు మంజూరు చేయాలనడం వంటి విద్యాశాఖ నిర్ణయాలు ప్రైవేటు పాఠశాలలకు తీవ్రం నష్టం కలిగిస్తాయని విద్యోదయ కరస్పాండంట్ శ్రీనివాసులు నాయుడు,న్యూ లిటిల్ ఫ్లవర్ రామకృష్ణ రెడ్డి,సాయి విద్యానికేతన్ శ్రీనివాసరావు,బ్రహ్మర్షి,కేశవ రెడ్డి,ఎస్విఎల్ ప్రవీణ్,డైమండ్ చక్రపాణి,విజేత శ్రీనివాస శర్మలు పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం మండల విద్యాశాఖ అధికారి ఎం.ప్రభాకర్ రెడ్డికి వారు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సుప్రీం కోర్టు ఏదైనా విద్యార్థి ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలకు మారాలంటే,బ్యాలెన్స్ ఉన్న ఫీజులో కనీసం 50 శాతం చెల్లించి టీసీలు తీసుకోవాలని మరియు మిగతా బ్యాలెన్స్ మొత్తాన్ని ఆరు విడతలలో చెల్లించాలని తీర్పు ఇచ్చిందన్నారు.అనంతరం ఆయా కరెస్పాండెంట్ల అనుమతితో విద్యార్థి చేరే ప్రభుత్వ/ప్రవేటు పాఠశాలల చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు.అయితే ప్రస్తుతం విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే కరస్పాండెంట్ల అనుమతి అవసరం లేదంటూ ఆదేశాలు జారీ చేయడం అభ్యంతరకరమన్నారు.ఇటువంటి నిర్ణయాలు ప్రైవేట్ పాఠశాలల మనుగడకు ప్రమాదకరమన్నారు.ఈ నిర్ణయంపై మండల విద్యాశాఖ,జిల్లా విద్యాశాఖ అధికారులు పునరాలోచించాలని,తమ విజ్ఞప్తిని రాష్ట్ర విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్,ఉన్నత విద్యాశాఖ అధికారులు దృష్టికి తీసుకెళ్లి ప్రైవేటు పాఠశాలలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: