Saturday, 12 September 2026 12:07:29 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

మిట్స్ వర్సిటీలో ఆధునాతన ఎం.ఎల్ పద్దతులపై అతిథి ఉపన్యాసం - హాజరైన ఐసిఎఎంఎస్ పోస్ట్‌ డాక్టోరల్ రీసెర్చ్ సైంటిస్ట్‌ డాక్టర్ పి.శ్వేత

Date : 07 September 2026 08:10 PM Views : 39

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మిట్స్ వర్సిటీలో ఆధునాతన ఎం.ఎల్ పద్దతులపై అతిథి ఉపన్యాసం - హాజరైన ఐసిఎఎంఎస్ పోస్ట్‌ డాక్టోరల్ రీసెర్చ్ సైంటిస్ట్‌ డాక్టర్ పి.శ్వేత మదనపల్లె : మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం లాజిస్టిక్ రిగ్రెషన్ : ఆధునిక మెషిన్ లెర్నింగ్ యొక్క నిర్మాణ అంశాలు అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జర్మనీలోని రుహర్ యూనివర్సిటీ బోచుమ్ ఐసిఎఎంఎస్ (ఇంటర్ డిస్సిప్లినరీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ సిములేషన్) విభాగంలో మెటీరియల్స్ సైంటిస్ట్ మరియు పోస్ట్‌డాక్టోరల్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ పి.శ్వేత హాజరై,జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది డేటాను వివిధ వర్గాలుగా గుర్తించడానికి ఉపయోగించే సులభమైన మరియు సమర్థవంతమైన మెషిన్ లెర్నింగ్ పద్ధతన్నారు.మెషిన్ లెర్నింగ్,డేటా సైన్స్,మెటీరియల్స్ ఇన్ఫర్మేటిక్స్,మోడలింగ్ మరియు సిమ్యులేషన్ వంటి ఆధునిక ఏ.ఐ వ్యవస్థల్లో మెషిన్ లెర్నింగ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.డేటాను ముందుగా సరిచేయడం,అవసరమైన సమాచారాన్ని ఎంపిక చేసుకోవడం,మోడల్‌కు శిక్షణ ఇవ్వడం,ఫలితాలను అంచనా వేయడం,మోడల్ పనితీరును పరిశీలించడం వంటి అంశాలను విద్యార్థులకు ఉదాహరణలతో వివరించారు.లాజిస్టిక్ రిగ్రెషన్‌ను ఉపయోగించి ఈ-మెయిల్ స్పామ్ గుర్తింపు,వైద్య నిర్ధారణ,క్రెడిట్ రిస్క్ అంచనా,కస్టమర్ ప్రవర్తన విశ్లేషణ,భావ విశ్లేషణ,పారిశ్రామిక నాణ్యత నియంత్రణ వంటి అనేక వాస్తవ ప్రపంచ అనువర్తనాల్లో ఉపయోగించవచ్చని తెలిపారు.విద్యార్థులు ఏ.ఐ అండ్ ఎమ్.యల్ మరియు డేటా సైన్స్ రంగాలలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా తమ ప్రోగ్రామింగ్,డేటా అనాలిసిస్,ప్రాబ్లమ్ సాల్వింగ్,మోడల్ బిల్డింగ్ మరియు పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు.విద్యార్థులు పరిశ్రమ అవసరాలతోపాటు ఉన్నత విద్య మరియు అంతర్జాతీయ పరిశోధనా అవకాశాల దిశగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్,విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పనా,కోఆర్డినేటర్ డాక్టర్ కె.హేమలత,అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :