Saturday, 13 June 2026 07:48:53 AM
# ట్రాఫిక్ సిబ్బందికి వేసవి రక్షణ కోసం కిట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # తంబళ్లపల్లెలో జనగణన సర్వే సంతృప్తికరంగా జరిగింది - తాహాసిల్దార్ శ్రీనివాసులు # తంబళ్లపల్లెలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలపై ర్యాలీ # తిరుపతి విజయోత్సవ సభకు కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు # తంబళ్లపల్లెలో యోగాంద్ర విజయవంతం చేయండి - ఇంచార్జ్ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ # మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో పీహెచ్.డి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం # ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు - తృటిలో తప్పిన పెను ప్రమాదం # ఐక్యత తోనే బిసిల అభివృద్ధి, రాజ్యాధికారం సాధ్యం -- బిసివై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ # ఎడ్జ్ మేధస్సుతో బ్యాటరీ రక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ రూపొందించిన మిట్స్ విద్యార్థులు # మంత్రి కొల్లు రవీంద్ర కు మల్లయ్య కొండ మైనింగ్ పై ఫిర్యాదు # మల్లయ్య కొండల మహాశివుడు అందరికీ ఆరాధ్య దైవం # తంబళ్లపల్లె లో 90వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణానికి స్థలపరిశీలన # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ శ్రీ రవి రాజు ఎల్లాప్రగడా కు డాక్టరేట్ # ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడమే కూటమి లక్ష్యం - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # మూడు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం @ 22 పశువులకు తీవ్ర గాయాలు # పోలియో రహిత సమాజం కోసం సహకరించండి - డాక్టర్ షణ్ముగం # మహిళా సంఘాలకు స్త్రీనిధి క్రెడిట్ పాలసీ వర ప్రధాయని - ఏపిఎం గంగాధర్ # ఉపాధి హామీ లో కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత - ఏపీడి చందన # రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు - ఏపిఎం గంగాధర్ # కదిరి ఆర్.డి.ఓ. గా బి. కొత్తకోట కు చెందిన ఆవుల కళావతి

మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ శ్రీ రవి రాజు ఎల్లాప్రగడా కు డాక్టరేట్

కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగం లో డాక్టరేట్ ఇచ్చిన కళింగ యూనివర్సిటీ

Date : 10 June 2026 10:57 PM Views : 28

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 10 : మదనపల్లి పట్టణం సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీ రవి రాజు ఎల్లాప్రగడకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కళింగ యూనివర్సిటీ, రాయ్‌పూర్ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టా లభించినట్లు మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. వినియోగదారుల లక్షణాలు మరియు గుర్తింపుల ఆధారంగా డేటాను సురక్షితంగా భద్రపరచి, అవసరమైన వారికి మాత్రమే పంచుకునే గుప్తీకరణ విధానం అనే అంశంపై డాక్టర్ రాహుల్ చావ్డా పర్యవేక్షణలో నిర్వహించిన పరిశోధనకు గాను ఈ పీహెచ్‌డీ పట్టాను ప్రదానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. డిజిటల్ సమాచార భద్రత, డేటా గోప్యత మరియు అధీకృత వినియోగదారులకు మాత్రమే సమాచారాన్ని సురక్షితంగా పంచుకునే ఆధునిక గుప్తీకరణ సాంకేతికతల అభివృద్ధికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో సైబర్ భద్రత, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు సురక్షిత డేటా భాగస్వామ్య వ్యవస్థల అభివృద్ధిలో ఈ పరిశోధన ఫలితాలు కీలక పాత్ర పోషించే అవకాశముందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీహెచ్‌డీ పట్టా పొందిన రవి రాజు ఎల్లాప్రగడను మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగాధిపతి డాక్టర్ ఆర్. కల్పనా మరియు అధ్యాపకులు అభినందనలు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :