నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 10 : మదనపల్లి పట్టణం సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శ్రీ రవి రాజు ఎల్లాప్రగడకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కళింగ యూనివర్సిటీ, రాయ్పూర్ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టరేట్ (పీహెచ్డీ) పట్టా లభించినట్లు మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. వినియోగదారుల లక్షణాలు మరియు గుర్తింపుల ఆధారంగా డేటాను సురక్షితంగా భద్రపరచి, అవసరమైన వారికి మాత్రమే పంచుకునే గుప్తీకరణ విధానం అనే అంశంపై డాక్టర్ రాహుల్ చావ్డా పర్యవేక్షణలో నిర్వహించిన పరిశోధనకు గాను ఈ పీహెచ్డీ పట్టాను ప్రదానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. డిజిటల్ సమాచార భద్రత, డేటా గోప్యత మరియు అధీకృత వినియోగదారులకు మాత్రమే సమాచారాన్ని సురక్షితంగా పంచుకునే ఆధునిక గుప్తీకరణ సాంకేతికతల అభివృద్ధికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో సైబర్ భద్రత, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు సురక్షిత డేటా భాగస్వామ్య వ్యవస్థల అభివృద్ధిలో ఈ పరిశోధన ఫలితాలు కీలక పాత్ర పోషించే అవకాశముందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీహెచ్డీ పట్టా పొందిన రవి రాజు ఎల్లాప్రగడను మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగాధిపతి డాక్టర్ ఆర్. కల్పనా మరియు అధ్యాపకులు అభినందనలు తెలిపారు
Reporter
Namitha News