నమిత న్యూస్ - Andhra Pradesh / YSRkadapa : రాజంపేట - మే 23 : రాజంపేట మండలం పులపత్తూరు గ్రామంలో సి.సి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పల్లె ప్రగతి, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా రోడ్డు పనులు వేగంగా పూర్తిచేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సి.సి రోడ్ల నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందని ఆయన ఆరోపించారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో జరగాలని గుత్తేదారులకు సూచించారు
Reporter
Namitha News