నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 23 : తంబళ్లపల్లె మండలం లో గత మూడు రోజులుగా త్రైత సిద్ధాంత శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల ఆశీస్సులతో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందు జ్ఞానవేదిక నెల్లూరు కమిటీ ఆధ్వర్యంలో జరిగిన త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం శనివారం ముగిసింది. ఉదయం కొట్టాల, గోపి దీన్నే, జుంజుర పెంట, ఆర్ ఎన్ తాండ పంచాయతీల్లో 61 గ్రామాల్లో త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథాల ధర్మపరిచారు నెల్లూరు, కుప్పం కమిటీ అధ్యక్షుడు సురమౌళి ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన దేవుడే అవతరించి మనిషిగా జన్మిస్తే భగవంతుడు అంటాం అలాంటి భగవంతుడే శ్రీకృష్ణుడు ఆయన మాత్రమే అందరూ దైవంగా గుర్తించాలని ఆయన సేవతో గ్రామాలలో ప్రకృతి వైపరీత్యాలు, రోగ బాధలు ఉండవని ప్రజలకు ఉపదేశించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని భగవానుని ఊరేగింపు నిర్వహించారు. ఆయన వెంట కమిటీ సభ్యులు కృష్ణ, వెంకటేష్, రాధ, లక్ష్మయ్య, విజయమ్మ, రమ, కావ్యశ్రీ, కృష్ణ, సుమలత, కీర్తి శ్రీ, అవినాష్, శ్రీదేవి, జ్ఞానేశ్వర్, శేఖర్, సునీత, నరసింహ ప్రసాద్ పాల్గొన్నారు
Reporter
Namitha News