Thursday, 30 July 2026 04:33:48 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

డైలీ మార్కెట్ ఎదురుగా నూతనంగా వేసిన రోడ్డపై ప్రజల ఇబ్బందులు గమనించండి -- అధికారుకు సూచించిన నిసార్ అహమ్మద్

Date : 03 December 2025 03:50 PM Views : 131

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డైలీ మార్కెట్ ఎదురుగా నూతనంగా వేసిన రోడ్డపై ప్రజల ఇబ్బందులు గమనించండి -- అధికారుకు సూచించిన నిసార్ అహమ్మద్ సిమెంటు రోడ్డ వేసి క్యూరింగ్ చేసిన తరువాత బంకమట్టి రోడ్డపై వదిలేసిన కాంట్రాక్టర్ పైన అధికారులు చర్యలు తీసుకోరా అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ ప్రశ్నించారు.‌ బుధవారం చిత్తూరు బస్టాండు సమీపంలో చెంబకురు వెళ్ళే రహదారిలో డైలీ మార్కెట్ సమీపంలో స్దానిక ప్రజలు నిసార్ అహమ్మద్ దృష్టికి సమస్యను తీసుకుని వెళ్ళారు. గత రెండు నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు స్పందించలేదని స్దానికులు వాపోయారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే దారిలో కాంట్రాక్టర్ నిర్వహకంపై నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ సిమెంట్ రోడ్డ వేసి అనంతరం క్యూరింగ్ కోసం వేసిన బంక మట్టి రోడ్డు పక్కకు తోసి వేసి ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందని అన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బంది స్వయంగా చూడటం జరిగిందని అన్నారు.‌ మట్టిని తొలగించాల్సిన కాంట్రాక్టర్ పక్కకు వేసి వెళ్ళిపోయాడని, సంబంధించిన శాఖ అధికారులు తొలగించడానికి సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ‌వర్షం రావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నాని, ఇప్పటికైన స్పందించి మట్టిని తొలగించాలని కోరారు. గతంలో సైతం చిత్తూరు బస్టాండు సర్కిల్ నుంచి ఆర్ అండ్ బి కి వెళ్ళే దారిలో సైతం సిమెంట్ రోడ్డు వేసిన సందర్భంలో ఇలాగే చేశారని గుర్తు చేశారు. ‌అధికార యంత్రాంగం సరైన చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :