నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 10 ః మండలంలోని గుండ్లపల్లి పంచాయతీలోని రైతాంగం రాబోయే ఖరీఫ్ సాగుకు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించడానికి సిద్ధమవుతున్నారు. ఏడాదిగా స్థానిక పోర్డు స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ లలితమ్మ, సిబ్బంది స్థానిక రైతులకు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల తయారీ, ఆధునిక సేద్యం పై రైతు యాత్రలతో చైతన్యం నింపి గత రబీ సీజన్లో ప్రకృతి వ్యవసాయంలో వేరుశనగ, మొక్కజొన్న, కూరగాయల పంటలు వేసి సత్ఫలితాలు సాధించారు. సేంద్రియ ఎరువులు, కషాయాల తయారీపై గుండ్లపల్లి లో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో గుండ్లపల్లి రైతులు ఖరీఫ్ సాగులో భాగంగా వేరుశనగ పంటలతో పాటు సజ్జలు, కంది, కొర్రలు, సామలు, పలు రకాల కూరగాయలు పండించి ఆదర్శంగా నిలవడానికి ముందుకు రావడం హర్షణీయం
Reporter
Namitha News