Tuesday, 15 September 2026 09:44:15 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

మంత్రి కొల్లు రవీంద్ర కు మల్లయ్య కొండ మైనింగ్ పై ఫిర్యాదు

Date : 11 June 2026 10:21 PM Views : 316

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 11 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండల్లో మైనింగ్ సర్వే పై ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోందని శతాబ్దాల చరిత్ర కలిగిన మల్లయ్య కొండ మహాశివుడు స్థిరపడిన కొండల్లో మైనింగ్ చేపడితే లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని దీనిపై అధిష్టానంతో మాట్లాడి మైనింగ్ చర్యలు ఆపడానికి సహకరించాలని రాష్ట్ర భూగర్భ గనుల శాఖమంత్రి కొల్లు రవీంద్ర కు తంబళ్లపల్లె టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లయ్య కొండల్లో గత కాంగ్రెస్ పాలనలో మైనింగ్ కు అనుమతి ఇచ్చి లక్షలాదిమంది ప్రజల ఆందోళన కార్యక్రమాలు, మైనింగ్ చేపడితే జరిగే అరిష్టాలు కూలంకషంగా మంత్రికి వివరించారు. మంత్రి కొల్లు రవీంద్ర నాయకులు మల్లయ్య కొండ చరిత్ర ఆలకించి మల్లయ్య కొండ మైనింగ్ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. మల్లయ్య కొండ మైనింగ్ పై రాష్ట్ర ఎన్విరాన్మెంట్ చైర్మన్ దినేష్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబులు సైతం మల్లయ్య కొండ సమస్య సున్నితమైనదని ప్రజల మనోభావాలను గుర్తించాలని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తొలుత రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, టిడిపి రాష్ట్ర బిసి ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, నాయకుల ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎన్విరాన్మెంట్ చైర్మన్ దినేష్ రెడ్డి, పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సువాసి ప్రసాద్ బాబు లను ఘనంగా సన్మానించి ఎన్టీఆర్ చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దదిక్కు లేక గ్రూపులు తయారై కార్యకర్తలు దిక్కులేని వారిగా తయారయ్యారని ఈ సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సహకరించాలని మంత్రిని కోరారు. వారి వెంట మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :