Saturday, 13 June 2026 07:48:39 AM
# ట్రాఫిక్ సిబ్బందికి వేసవి రక్షణ కోసం కిట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # తంబళ్లపల్లెలో జనగణన సర్వే సంతృప్తికరంగా జరిగింది - తాహాసిల్దార్ శ్రీనివాసులు # తంబళ్లపల్లెలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలపై ర్యాలీ # తిరుపతి విజయోత్సవ సభకు కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు # తంబళ్లపల్లెలో యోగాంద్ర విజయవంతం చేయండి - ఇంచార్జ్ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ # మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో పీహెచ్.డి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం # ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు - తృటిలో తప్పిన పెను ప్రమాదం # ఐక్యత తోనే బిసిల అభివృద్ధి, రాజ్యాధికారం సాధ్యం -- బిసివై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ # ఎడ్జ్ మేధస్సుతో బ్యాటరీ రక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ రూపొందించిన మిట్స్ విద్యార్థులు # మంత్రి కొల్లు రవీంద్ర కు మల్లయ్య కొండ మైనింగ్ పై ఫిర్యాదు # మల్లయ్య కొండల మహాశివుడు అందరికీ ఆరాధ్య దైవం # తంబళ్లపల్లె లో 90వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణానికి స్థలపరిశీలన # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ శ్రీ రవి రాజు ఎల్లాప్రగడా కు డాక్టరేట్ # ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడమే కూటమి లక్ష్యం - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # మూడు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం @ 22 పశువులకు తీవ్ర గాయాలు # పోలియో రహిత సమాజం కోసం సహకరించండి - డాక్టర్ షణ్ముగం # మహిళా సంఘాలకు స్త్రీనిధి క్రెడిట్ పాలసీ వర ప్రధాయని - ఏపిఎం గంగాధర్ # ఉపాధి హామీ లో కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత - ఏపీడి చందన # రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు - ఏపిఎం గంగాధర్ # కదిరి ఆర్.డి.ఓ. గా బి. కొత్తకోట కు చెందిన ఆవుల కళావతి

మంత్రి కొల్లు రవీంద్ర కు మల్లయ్య కొండ మైనింగ్ పై ఫిర్యాదు

Date : 11 June 2026 10:21 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 11 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండల్లో మైనింగ్ సర్వే పై ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోందని శతాబ్దాల చరిత్ర కలిగిన మల్లయ్య కొండ మహాశివుడు స్థిరపడిన కొండల్లో మైనింగ్ చేపడితే లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని దీనిపై అధిష్టానంతో మాట్లాడి మైనింగ్ చర్యలు ఆపడానికి సహకరించాలని రాష్ట్ర భూగర్భ గనుల శాఖమంత్రి కొల్లు రవీంద్ర కు తంబళ్లపల్లె టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లయ్య కొండల్లో గత కాంగ్రెస్ పాలనలో మైనింగ్ కు అనుమతి ఇచ్చి లక్షలాదిమంది ప్రజల ఆందోళన కార్యక్రమాలు, మైనింగ్ చేపడితే జరిగే అరిష్టాలు కూలంకషంగా మంత్రికి వివరించారు. మంత్రి కొల్లు రవీంద్ర నాయకులు మల్లయ్య కొండ చరిత్ర ఆలకించి మల్లయ్య కొండ మైనింగ్ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. మల్లయ్య కొండ మైనింగ్ పై రాష్ట్ర ఎన్విరాన్మెంట్ చైర్మన్ దినేష్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబులు సైతం మల్లయ్య కొండ సమస్య సున్నితమైనదని ప్రజల మనోభావాలను గుర్తించాలని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తొలుత రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, టిడిపి రాష్ట్ర బిసి ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, నాయకుల ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎన్విరాన్మెంట్ చైర్మన్ దినేష్ రెడ్డి, పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సువాసి ప్రసాద్ బాబు లను ఘనంగా సన్మానించి ఎన్టీఆర్ చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దదిక్కు లేక గ్రూపులు తయారై కార్యకర్తలు దిక్కులేని వారిగా తయారయ్యారని ఈ సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సహకరించాలని మంత్రిని కోరారు. వారి వెంట మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :