నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 11 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండల్లో మైనింగ్ సర్వే పై ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోందని శతాబ్దాల చరిత్ర కలిగిన మల్లయ్య కొండ మహాశివుడు స్థిరపడిన కొండల్లో మైనింగ్ చేపడితే లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని దీనిపై అధిష్టానంతో మాట్లాడి మైనింగ్ చర్యలు ఆపడానికి సహకరించాలని రాష్ట్ర భూగర్భ గనుల శాఖమంత్రి కొల్లు రవీంద్ర కు తంబళ్లపల్లె టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లయ్య కొండల్లో గత కాంగ్రెస్ పాలనలో మైనింగ్ కు అనుమతి ఇచ్చి లక్షలాదిమంది ప్రజల ఆందోళన కార్యక్రమాలు, మైనింగ్ చేపడితే జరిగే అరిష్టాలు కూలంకషంగా మంత్రికి వివరించారు. మంత్రి కొల్లు రవీంద్ర నాయకులు మల్లయ్య కొండ చరిత్ర ఆలకించి మల్లయ్య కొండ మైనింగ్ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. మల్లయ్య కొండ మైనింగ్ పై రాష్ట్ర ఎన్విరాన్మెంట్ చైర్మన్ దినేష్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబులు సైతం మల్లయ్య కొండ సమస్య సున్నితమైనదని ప్రజల మనోభావాలను గుర్తించాలని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తొలుత రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్, టిడిపి రాష్ట్ర బిసి ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, నాయకుల ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎన్విరాన్మెంట్ చైర్మన్ దినేష్ రెడ్డి, పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సువాసి ప్రసాద్ బాబు లను ఘనంగా సన్మానించి ఎన్టీఆర్ చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దదిక్కు లేక గ్రూపులు తయారై కార్యకర్తలు దిక్కులేని వారిగా తయారయ్యారని ఈ సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సహకరించాలని మంత్రిని కోరారు. వారి వెంట మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News