Monday, 08 June 2026 08:29:28 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

మిట్స్ విద్యార్థులకు కెరీర్ డెవలప్మెంట్ పై అవగాహన

Date : 29 January 2026 09:28 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 28 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్) విభాగం వారు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం విద్యార్థులకు కెరీర్ మార్గాలపై అవగాహన కల్పించేందుకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెన్నైకి చెందిన హెచ్‌సిఎల్ గువి సీనియర్ మేనేజర్ వి. లక్ష్మణ నారాయణన్ రిసోర్స్ పర్సన్‌గా హాజరై, విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. నేటి ఉద్యోగ అవకాశాల్లో డిగ్రీలతో పాటు కమ్యూనికేష స్కిల్స్, ఎంతో ముఖ్యమని ఆయన వివరించారు. యాదృచ్ఛికంగా స్కిల్స్ నేర్చుకోవడం, కెరీర్ దిశపై స్పష్టత, లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెరుగుదల, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసంపై దృష్టి పెట్టాలని సూచించారు. “ఉద్యోగాల వెనుక పరిగెత్తకండి… నైపుణ్యాలు మరియు వాటికి ఆధారాలు నిర్మించండి — అప్పుడు ఉద్యోగాలే మీ వెనుక వస్తాయి” అని అన్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న సి.ఎస్.ఈ, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్, నెట్వర్క్స్ విద్యార్థులకు ప్రస్తుత ఆధునిక టూల్స్, ప్లాట్‌ఫార్మ్స్ మరియు పరిశ్రమలో అమలులో ఉన్న ఉత్తమ పద్ధతులపై యూనివర్సిటీ నందు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగయోగ్యత, అలాగే ఇంటర్న్‌షిప్స్ మరియు ప్లేస్‌మెంట్స్‌కు అవసరమైన సిద్ధతను మరింత మెరుగుపరుస్తుందని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్. పద్మ, కోఆర్డినేటర్ ఎమ్.రాజేశ్వరి, శాయీజ్ అహమ్మద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :