నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 07 : తంబళ్లపల్లె మండలంలో జరిగిన ఉపాధి హామీ పై జరిగిన సామాజిక తనిఖీలో రూ 78వేలు రికవరీకి జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఆదేశించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఉపాధి హామీ పనుల పై బహిరంగ విచారణ సభ జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని 21 పంచాయతీలకు సంబంధించి జరిగిన ఉపాధి పనులపై పంచాయతీల వారీగా విచారణ జరిపారు. మండలంలో అత్యధికంగా గంగిరెడ్డిపల్లి పంచాయతీలో ఉపాధి హామీ బిల్లులు ఉద్యోగులకు చేసి నిధులు దుర్వినియోగం జరిగినట్లు విచారణలో వెల్లడైంది.ఇందుకు సంబంధించి రూ41,834, వెయ్యి అపరాధ రుసుము పీ.డీ రికవరీకి ఆదేశించారు. పలు పంచాయతీలలో ఉపాధి హామీలో నాటిన మొక్కలు చనిపోవడంతో పీ డీ మందలించి వెంటనే మొక్కలు నాటించాలని ఆదేశించారు. ఉపాధి అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయకపోవడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసి సర్వర్ క్యాప్సల్ చేయాలని సూచించారు. పలు ఉపాధి పనులకు సంబంధించి రికవరీలతో బాటు అపరాధ రుసుము చెల్లించాలని ఆదేశించారు. కాగా మండలంలో ఆర్ఎన్ తాండ, కొటాల, కన్నె మడుగు, మర్రిమాకులపల్లి, ఎద్దుల వారి పల్లి, కోటకొండ, పంచాయతీలలో ఉపాధి హామీ పనులు నిర్వహణ, బిల్లుల చెల్లింపు, మొక్కల పెంపకం తదితర అంశాలపై ఎలాంటి ఆరోపణలు రాకపోవడం పై వారిని అభినందించారు. భవిష్యత్తులో వీబిజి రాంజీ ఉపాధి హామీ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లబ్ధి ద్వారా నూతన ఒరవడి సృష్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ డి నందకుమార్ రెడ్డి, అంబుడ్స్ మెన్ శ్రీరాములు, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్,ఎస్ ఆర్ పి సూర్య చక్ర, తిరుమలేష్, ఏపీవో అంజనప్ప, పి ఆర్ ఏ ఈ రమణ, కంప్యూటర్ ఆపరేటర్లు రమేష్, ఆయేషా,టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, మాజీ జడ్పిటిసి రామచంద్ర, టిడిపి నాయకులు ఉత్తమ రెడ్డి, రామాంజులు, ఈసీలు మహేష్, రామన్న, టి ఏ లు సుజాత, పుష్ప కుమారి, బాలగంగాధర్, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News