Monday, 08 June 2026 10:00:45 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

తంబళ్లపల్లె సామాజిక తనిఖీలో రూ 78వేలు రికవరీ

ఆరు పంచాయతీలు క్లీన్ చిట్ - రికవరీ లో గంగిరెడ్డిపల్లి టాప్

Date : 07 January 2026 10:43 PM Views : 134

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 07 : తంబళ్లపల్లె మండలంలో జరిగిన ఉపాధి హామీ పై జరిగిన సామాజిక తనిఖీలో రూ 78వేలు రికవరీకి జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఆదేశించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఉపాధి హామీ పనుల పై బహిరంగ విచారణ సభ జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని 21 పంచాయతీలకు సంబంధించి జరిగిన ఉపాధి పనులపై పంచాయతీల వారీగా విచారణ జరిపారు. మండలంలో అత్యధికంగా గంగిరెడ్డిపల్లి పంచాయతీలో ఉపాధి హామీ బిల్లులు ఉద్యోగులకు చేసి నిధులు దుర్వినియోగం జరిగినట్లు విచారణలో వెల్లడైంది.ఇందుకు సంబంధించి రూ41,834, వెయ్యి అపరాధ రుసుము పీ.డీ రికవరీకి ఆదేశించారు. పలు పంచాయతీలలో ఉపాధి హామీలో నాటిన మొక్కలు చనిపోవడంతో పీ డీ మందలించి వెంటనే మొక్కలు నాటించాలని ఆదేశించారు. ఉపాధి అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయకపోవడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసి సర్వర్ క్యాప్సల్ చేయాలని సూచించారు. పలు ఉపాధి పనులకు సంబంధించి రికవరీలతో బాటు అపరాధ రుసుము చెల్లించాలని ఆదేశించారు. కాగా మండలంలో ఆర్ఎన్ తాండ, కొటాల, కన్నె మడుగు, మర్రిమాకులపల్లి, ఎద్దుల వారి పల్లి, కోటకొండ, పంచాయతీలలో ఉపాధి హామీ పనులు నిర్వహణ, బిల్లుల చెల్లింపు, మొక్కల పెంపకం తదితర అంశాలపై ఎలాంటి ఆరోపణలు రాకపోవడం పై వారిని అభినందించారు. భవిష్యత్తులో వీబిజి రాంజీ ఉపాధి హామీ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లబ్ధి ద్వారా నూతన ఒరవడి సృష్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ డి నందకుమార్ రెడ్డి, అంబుడ్స్ మెన్ శ్రీరాములు, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్,ఎస్ ఆర్ పి సూర్య చక్ర, తిరుమలేష్, ఏపీవో అంజనప్ప, పి ఆర్ ఏ ఈ రమణ, కంప్యూటర్ ఆపరేటర్లు రమేష్, ఆయేషా,టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, మాజీ జడ్పిటిసి రామచంద్ర, టిడిపి నాయకులు ఉత్తమ రెడ్డి, రామాంజులు, ఈసీలు మహేష్, రామన్న, టి ఏ లు సుజాత, పుష్ప కుమారి, బాలగంగాధర్, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :