నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 24 : తంబళ్లపల్లె నియోజకవర్గ అభివృద్ధి 2024 విజన్ పనులలో భాగంగా శ్రీనివాస కాలనీలో సీసీ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నట్లు టిడిపి తెలుగు యువత నియోజకవర్గం ఉపాధ్యక్షుడు నరసింహులు తెలిపారు. గత పది రోజుల క్రితం తంబళ్లపల్లె ప్రత్యేక అధికారి వెంకటరత్నం తంబళ్లపల్లె నియోజకవర్గ అభివృద్ధికి 2047 విజన్ లో భాగంగా 70 లక్షలతో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఇందులో భాగంగా శ్రీనివాస కాలనీలో సిసి రోడ్డు పనులు శరవేగంగా జరుగుతుండగా తదుపరి ఆర్టీసీ బస్టాండ్ కాలనీ, మసీదు వీధి లలో సీసీ రోడ్లతోపాటు డ్రైనేజీ పనులు చేపడతామని పంచాయతీరాజ్ ఏఈ రమణ తెలిపారు. సిసి రోడ్ల నిర్మాణ పనులలో నాణ్యత లోపం లేకుండా పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు
Reporter
Namitha News