నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : శాంతిపురం - మార్చి 23 : చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శాంతిపురం మండలం లోని రాళ్లబూదుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో యస్.ఐ. నరేష్ పర్యవేక్షణ లో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ పై అవగాహన కల్పించి, హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం లో ప్రణాపాయం నుండీ తప్పించుకోవచ్చు అంటూ అవగాహనా కల్పించి హెల్మెట్ ధరించడం ఎంత ప్రాముఖ్యత ఉందో వివరించిన పోలీసులు. ఈ మేరకు జన సందోహం ఉన్న ప్రాంతాల్లో, రహదారులపైన, కూడళ్ల వద్ద ప్రజలకు అవగాహనా కల్పించి వాహన చోదకుడి తో పాటు వెనుక కూర్చున్న వారు కూడా ధరిస్తే ఎంతో మేలుచేకూరుతుందని వెల్లడిస్తూ,ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇకపై హెల్మెట్ ధరించక పోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు
Reporter
Namitha News