నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు.. అన్నమయ్య జిల్లా,పుంగనూరు కోనేరు వద్ద వెలసిండు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో బిజెపి నాయకులు నరేంద్ర మోడీ పేరుపైన అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ పుష్కర కాలం పాటు భారతదేశ ప్రజల కు అనేక విధాలుగా అభివృద్ధి పథకాలు చేకూరుస్తూ దేశం సుభిక్షంగా ఉండడానికి కృషి చేస్తున్నారని, ప్రజలు నరేంద్ర మోడీ వారి పరిపాలనలో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారని కొనియాడారు, పూజా కార్యక్రమంలో పుంగనూరు బిజెపి పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు, బిజెపి సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్ చంద్రశేఖర్ రాజు, వెంకటరెడ్డి, రమేష్,మఠం బాబు మల్లికా రాణి,ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News