నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 12 : తంబళ్లపల్లి మండలంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగిన జనగణన సర్వే కార్యక్రమం అధికారుల సహకారంతో పూర్తి చేయడం సంతృప్తికరంగా ఉందని తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలో 2013 ఓటర్ల లిస్టు లో 39,914 మంది ఓటర్లు ఉండగా నేడు 36,227 ఓటర్లు నమోదైనట్లు ఇందులో వలసలు వెళ్లినవారు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారు సుమారు 3000 పైగా ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా నేడు మదనపల్లిలో జరిగే ఎస్ ఐ ఆర్ కొరకు వారికి పాలు రకాల సలహాలు, సూచనలు చేశారు. మండలంలో భూ గిరి సర్వే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోందని స్థానికంగా వచ్చే సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ పక్క ప్రణాళికతో రైతులకు పక్కాగా పాస్ పుస్తకాలు పంపిణీ సహకరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు, కార్యదర్శులు పాల్గొన్నారు
Reporter
Namitha News