నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 29 : నిరుపేదలకు కూడు,గూడు, గుడ్డ అందించాలని నాడు ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి నేడు అణగారిన వర్గాలకు ఆశాదీపం లా నిలిచినట్లు రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు కొనియాడారు. ఆదివారం మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన సందర్భంలో అన్న ఎన్టీఆర్ 1982 లో టిడిపిని స్థాపించి తెలుగుజాతి తలెత్తుకునేలా చేయగా సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో టిడిపి దేశ చరిత్ర లోనే సువర్ణ అక్షరాలతో లిఖించే స్థాయికి తీసుకెళ్లినట్లు ప్రశంసించారు. ఆయన స్ఫూర్తితో ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడు పార్టీ కోసం పనిచేసి భవిష్యత్తులో ప్రజా సంక్షేమం కోసం అండగా నిలబడాలని సూచించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల టిడిపి నాయకులు కార్యకర్తలు విభేదాలు మరిచి ఐకమత్యంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుట ఎగరవేయడానికి సిద్ధం కావాలన్నారు. తంబళ్లపల్లె ఇన్చార్జి విషయం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకునే నాయకుడిని త్వరలో ఎంపిక చేస్తారని పార్టీ ఆదేశాలతో క్రమశిక్షణ పాటించి టిడిపి శ్రేణులు కలసికట్టుగా పనిచేయాలన్నారు. టిడిపి కంచుకోట తంబళ్లపల్లె లో పూర్వ వైభవానికి కార్యకర్తలకు అండగా ఉండి నా శాయశక్తులా పూర్తి సహకారం అందిస్తానని ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తెస్తే పరిష్కరిస్తానన్నారు. పర్వీన్ తాజ్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం ఎన్టీఆర్ టిడిపి స్థాపించి నిరుపేదల పాలిట దైవంగా నిలిచారని కొనియాడారు. తంబళ్లపల్లె టిడిపి నాయకులు వర్గ విభేదాలు మరచి పార్టీ జెండా, అజెండా ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. అనంతరం ఆరు మండలాల సీనియర్ టిడిపి నాయకులను దృశ్యాలవలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు. తంబళ్లపల్లె మార్చి 29 ప( నమిత న్యూస్ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య) నిరుపేదలకు కూడు,గూడు, గుడ్డ అందించాలని నాడు ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి నేడు అణగారిన వర్గాలకు ఆశాదీపం లా నిలిచినట్లు రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు కొనియాడారు. ఆదివారం మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన సందర్భంలో అన్న ఎన్టీఆర్ 1982 లో టిడిపిని స్థాపించి తెలుగుజాతి తలెత్తుకునేలా చేయగా సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో టిడిపి దేశ చరిత్ర లోనే సువర్ణ అక్షరాలతో లిఖించే స్థాయికి తీసుకెళ్లినట్లు ప్రశంసించారు. ఆయన స్ఫూర్తితో ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడు పార్టీ కోసం పనిచేసి భవిష్యత్తులో ప్రజా సంక్షేమం కోసం అండగా నిలబడాలని సూచించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల టిడిపి నాయకులు కార్యకర్తలు విభేదాలు మరిచి ఐకమత్యంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుట ఎగరవేయడానికి సిద్ధం కావాలన్నారు. తంబళ్లపల్లె ఇన్చార్జి విషయం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకునే నాయకుడిని త్వరలో ఎంపిక చేస్తారని పార్టీ ఆదేశాలతో క్రమశిక్షణ పాటించి టిడిపి శ్రేణులు కలసికట్టుగా పనిచేయాలన్నారు. టిడిపి కంచుకోట తంబళ్లపల్లె లో పూర్వ వైభవానికి కార్యకర్తలకు అండగా ఉండి నా శాయశక్తులా పూర్తి సహకారం అందిస్తానని ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తెస్తే పరిష్కరిస్తానన్నారు. పర్వీన్ తాజ్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం ఎన్టీఆర్ టిడిపి స్థాపించి నిరుపేదల పాలిట దైవంగా నిలిచారని కొనియాడారు. తంబళ్లపల్లె టిడిపి నాయకులు వర్గ విభేదాలు మరచి పార్టీ జెండా, అజెండా ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. అనంతరం ఆరు మండలాల సీనియర్ టిడిపి నాయకులను దృశ్యాలవలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News