Saturday, 12 September 2026 12:07:18 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

అమరావతి టిడిపి కేంద్ర కార్యాలయంలో లీడర్షిప్ కాంక్లేవ్ - హాజరైన తంబళ్లపల్లి టిడిపి ఇన్చార్జ్ జి.శంకర్ యాదవ్

Date : 07 September 2026 08:22 PM Views : 45

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి టిడిపి కేంద్ర కార్యాలయంలో లీడర్షిప్ కాంక్లేవ్ - హాజరైన తంబళ్లపల్లి టిడిపి ఇన్చార్జ్ జి.శంకర్ యాదవ్ మదనపల్లె : అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం లీడర్షిప్ కాంక్లేవ్‌ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది.ఈ ప్రతిష్టాత్మక కాంక్లేవ్‌కి తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్,మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ హాజరయ్యారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పలు అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ కాంక్లేవ్‌ అద్భుతంగా సాగిందని,రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం,ప్రతిపక్ష వైకాపా విమర్శలను సమర్థవంతంగా తిప్పి కొట్టడం,త్వరలో జరుగబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి చక్కగా దిశానిర్దేశం చేశారన్నారు.కూటమి ధర్మం పాటిస్తూ మూడు పార్టీల నాయకులను అన్ని నియోజకవర్గాలలో కలుపుకొని పోవాలని సూచించారన్నారు.2024 శాసనసభ ఎన్నికల స్ఫూర్తితో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని తెలిపారన్నారు.సీఎం చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం ఆసక్తిని కలిగించిందని,పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందనడం సందేహం లేదన్నారు.తంబళ్లపల్లె నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని,స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.ఈ కాంక్లేవ్‌కి రాష్ట్రంలోని టిడిపి ఎమ్మెల్యేలు,నియోజకవర్గ ఇన్చార్జిలు హాజరు కావడంతో సందడి వాతావరణం నెలకొందన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :