నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 25 : ఆత్మకూరు పట్టణంలోని ACSR కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల గారి ఆదేశాలతో ఆత్మకూరు డీఎస్పీ కే. వేణుగోపాల్ సూచనలతో సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో విస్తృత తనిఖీలు.. ఈ కార్యక్రమంలో ఇద్దరు సీఐలు 7 మంది ఎస్ఐలు 50 మంది పోలీసులు పాల్గొన్నారు.. ప్రతి ఇంటిని పరిశీలించి ఇక్కడ నివసించి వారి వివరాలు తెలుసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు సీఐ గంగాధర్ పలు సూచనలు చేశారు. గంజాయి వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షణ చేయాలంటూ స్థానికులకు సూచించారు. ఈ తనిఖీ లో సరైన పత్రాలు లేని 31 స్కూటర్లను నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు..
Admin
Namitha News