Saturday, 18 April 2026 04:05:00 PM
# జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్ # తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత # ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం # దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ # మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం # నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువుల నింపుదలపై దృష్టి జలధార–జలహారతి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు # గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది # కురబల అభివృద్ధికి సమగ్ర కృషి # 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ # 13వేల రూ లంచం తీసుకొంటూ ఏసిబి పట్టుబడిన అబ్దుల్ రజాక్ # ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు # ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి # మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

Date : 16 April 2026 10:05 PM Views : 33

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 16 : తంబళ్లపల్లె నియోజకవర్గం లోని మహిళా సంఘాలు వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో అభివృద్ధిపై ముందడుగు వేయడానికి సహకరించాలని సర్ఫ్ డిపిఎం సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఏపీఎంలు, సీసీలు, ఎంఎస్ఓపిల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డిపిఎం సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా సంఘాలు పొందిన రుణాలు ముందస్తు వార్షిక ప్రణాళికతో ఆర్థిక అభివృద్ధి కి విభిన్న వ్యాపారాలు, కోళ్ల పరిశ్రమ, చేపల పెంపకం, మినీ పరిశ్రమలు, ప్రకృతి వ్యవసాయ పంటలు, పలు రకాల లాభదాయక వ్యాపారాల పై దృష్టి సారించాలని సూచించారు. మహిళా సంఘాలు విభిన్న వ్యాపారాలతో ఆర్థిక అభివృద్ధి తో పాటు వ్యాపార మెలకువలు అలవర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ఐకెపి అధికార యంత్రాంగం మహిళా సంఘాల వార్షిక జీవనోపాదులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి భవిష్యత్తు లో మహిళా సంఘాల బలోపేతం తో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా వారిలో చైతన్యం నింపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎపిఎంలు రమణ, సుబ్రహ్మణ్యం, ఏజీఎం సంతోష్ కుమార్, ఇండియన్ బ్యాంక్ మేనేజర్లు ప్రవీణ్ కుమార్, నాగరాజు, ఆరు మండలాల ఏపీఎంలు, సీసీలు, ఎంఎస్ఓపిలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :