Thursday, 30 July 2026 02:34:52 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

Date : 16 April 2026 10:05 PM Views : 190

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 16 : తంబళ్లపల్లె నియోజకవర్గం లోని మహిళా సంఘాలు వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో అభివృద్ధిపై ముందడుగు వేయడానికి సహకరించాలని సర్ఫ్ డిపిఎం సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఏపీఎంలు, సీసీలు, ఎంఎస్ఓపిల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డిపిఎం సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా సంఘాలు పొందిన రుణాలు ముందస్తు వార్షిక ప్రణాళికతో ఆర్థిక అభివృద్ధి కి విభిన్న వ్యాపారాలు, కోళ్ల పరిశ్రమ, చేపల పెంపకం, మినీ పరిశ్రమలు, ప్రకృతి వ్యవసాయ పంటలు, పలు రకాల లాభదాయక వ్యాపారాల పై దృష్టి సారించాలని సూచించారు. మహిళా సంఘాలు విభిన్న వ్యాపారాలతో ఆర్థిక అభివృద్ధి తో పాటు వ్యాపార మెలకువలు అలవర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ఐకెపి అధికార యంత్రాంగం మహిళా సంఘాల వార్షిక జీవనోపాదులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి భవిష్యత్తు లో మహిళా సంఘాల బలోపేతం తో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా వారిలో చైతన్యం నింపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎపిఎంలు రమణ, సుబ్రహ్మణ్యం, ఏజీఎం సంతోష్ కుమార్, ఇండియన్ బ్యాంక్ మేనేజర్లు ప్రవీణ్ కుమార్, నాగరాజు, ఆరు మండలాల ఏపీఎంలు, సీసీలు, ఎంఎస్ఓపిలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :