నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 15 ః నాటి వైకాపా ప్రభుత్వం చెత్త పై పన్ను వేస్తే స్వచ్ఛ రథం ద్వారా చెత్తను సైతం ఆదాయ వనరుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికే దక్కిందని టిడిపి నేతలు తెలుగు యువత నరసింహులు, సీనియర్ నాయకుడు బాలకృష్ణారెడ్డి, బీసీ నేతలు పురుషోత్తం, సామి రెడ్డి, రాచెరువు సంఘం అధ్యక్షుడు రామలింగారెడ్డి కొనియాడారు. శుక్రవారం తంబళ్లపల్లి మండల కేంద్రంలో స్వచ్ఛ రథం నిర్వహణ పై ఎంపీడీవో ఎంవి ప్రసాద్, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, కార్యదర్శిలు శ్రీనివాసరావు, ఈశ్వర్ రెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో వినియోగదారులకు పనికిరాని వస్తు సామాగ్రికి సరిపడా ఇంటి సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ భాస్కర్, వెంకట్ రెడ్డి, చాకనా వెంకటరమణ, హరినాథ్, ప్రజలు, వినియోగదారులు పాల్గొన్నారు.
Reporter
Namitha News