నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 19 : మదనపల్లిలో సిఎస్ఐ కమ్యూనిటీ హాల్ నందు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం మెగా చెక్కును ఎమ్మెల్యే షాజహాన్ భాష,ఎఎంసి చైర్మన్ జంగాల శివరాం రాయల్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా రామసముద్రం మండలంలోని 7002 మంది రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా 5000 రూపాయలు ,పీఎం కిసాన్ ద్వారా 2000 రూపాయలు లబ్ది చేకూర్చబడింది. ఈకార్యక్రమంలో రామసముద్రం మండలం నుంచి యువ నాయకులు గుండ్లపల్లి లోకేష్ రెడ్డి, కొమ్ము శ్రీనివాసులు, వెంకటరమణ, నాగప్ప, టేకుపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News