Monday, 14 September 2026 08:25:44 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

రౌడీషీటర్లకు డీఎస్పీ పావని స్ట్రాంగ్ వార్నింగ్ సత్ప్రవర్తనతో జీవించండి.. లేదంటే పీడీ యాక్ట్ తప్పదన్న హెచ్చరిక

Date : 17 May 2026 05:53 PM Views : 146

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రౌడీషీటర్లకు డీఎస్పీ పావని స్ట్రాంగ్ వార్నింగ్ సత్ప్రవర్తనతో జీవించండి.. లేదంటే పీడీ యాక్ట్ తప్పదన్న హెచ్చరిక సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మదనపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ బి. పావని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో రౌడీషీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు భారీ స్థాయిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన దాదాపు 200 మంది రౌడీషీటర్లు కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ పావని మాట్లాడుతూ పాత నేరప్రవృత్తికి పూర్తిగా స్వస్తి పలికి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవనం సాగించాలని తెలిపారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రౌడీయిజం, భూదందాలు, బెదిరింపులు లేదా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రౌడీషీటర్ల కదలికలపై స్థానిక పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, మళ్లీ నేరాల బాట పట్టిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. జిల్లా పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తోందని, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని డీఎస్పీ తేల్చిచెప్పారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: