Wednesday, 29 July 2026 05:19:28 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మదనపల్లి జిల్లా కేంద్రం సరే అభివృద్ధి ఏక్కడ...? - ఎంపీ మిథున్ రెడ్డి

టౌన్ బ్యాంకు అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలంటూ డిమాండ్

Date : 22 June 2026 08:43 PM Views : 62

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 22 : అమరావతికి మేము వ్యతిరేకం కాదు.. అందులో జరిగే అవినీతికి మా పార్డీ వ్యతిరేకం. అమరావతి లోనే అడుగుకు నాలుగు వేలతో ప్రవేట్ వ్యక్తులు నిర్మాణాలు చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం దేశంలో లేని విధంగా అడుగుకు ఇరవై వేల రూపాయలతో రాజధాని నిర్మాణం చేపడుతున్నారు ఇందులో భారీ అవినీతి చోటుచేసుకొంటుంది మదనపల్లి జిల్లా ప్రకటన తప్ప అభివృద్ధి శూన్యం. మెడికల్ కళాశాలను జగన్ మోహన్ రెడ్డి తీసుకుని వస్తే కూటమి ప్రభుత్వం ఆపేసింది. డెబై శాతం మెడికల్ కళాశాల నిర్మాణం ఇప్పటికే పూర్తి అయ్యింది మరో వంద కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వం ఆధీనంలో మెడికల్ కళాశాల నడపవచ్చు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మదనపల్లె బిటి కళాశాల యూనివర్సిటీకి కోసం జీవో విడుదల చేసింది. బిటి కళాశాలతో నియోజక వర్గం బాగుపడుతుంది. దీనిపై కూటమిలోని నేతలు దొమ్మలపాటి రమేష్ రాందాస్ చౌదరి ఎందుకు మౌనం వహిస్తున్నారు. మదనపల్లె టౌన్ బ్యాంక్ లో అవకతవకలు జరుగుతున్నాయి. ఈవిషయం తెలుగుదేశం వారే నాకు సమాచారం అందించారంటే ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై సమగ్ర దర్యప్తు కు డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం అభివృద్ధి పేపర్ మీద కాకుండా నేరుగా చెయ్యాలి. రెండేళ్లు గడచినా అభివృద్ది చేసిన దాఖాలాలు లేవు. మెడికల్ కళాశాల, భకబ్జాలు కూటమి మోసాలపై ప్రజలను చైతన్య పరుస్తాము. అభివృద్దిని అడిగితే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లేక నది మల్లయ్యకొండ లో ప్రభుత్వం మైనింగ్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ చూస్తూ ఉండదు స్థానికులతో కలసి వైఎస్ఆర్ పార్టీ మైనింగ్ అడ్డుకొంటుంది డిఎస్సీలో మొదటి ర్యాంక్ తెచ్చుకున్న వ్యక్తిని పక్కన పెట్టడంతోనే లికేజి వ్యవహామ బయటపడింది. పరీక్ష రాసి తెచ్చుకోవలసిన ఉద్యోగం అడ్డదారుల్లో తెచ్చుకోవడం అప్రజాస్వామికం. డిఎస్సీ పై పూర్తి విచారణ జరపాలి. మిథున్ రెడ్డి డిమాండ్ మామిడి రైతులు పూర్తిగా నష్టపోయింది. కూటమి ప్రభుత్వం లో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారిని ఆదుకోవాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నకల్లో ప్రజల్లో మాపైన ఉన్న నమ్మకమే మమ్మల్ని గెలిపిస్తుంది

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :