Thursday, 30 July 2026 10:49:25 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వైకాపా చెత్త మీద పన్ను వేస్తే మేము ఆ చెత్తనే కొంటున్నాం - రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ పట్టాభిరామ్

Date : 03 March 2026 08:26 PM Views : 275

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 03 : నాటి వైకాపా ప్రభుత్వం చెత్త మీద పన్నువేసి చెత్త ప్రభుత్వం గా నిలవగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఆ చెత్తని ప్రజలకు సేవ చేస్తున్నట్లు రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. మంగళవారం ఆయన స్వచ్ఛ ఆంధ్ర పై తంబళ్లపల్లె నియోజకవర్గం లోని అధికారులతో జరిగిన సమీక్ష లోఆయన ఆరు మండలాల ఎంపీడీవోలతో పారిశుధ్యం తో పాటు డంపింగ్ యార్డ్ ల నిర్వహణ, చెత్త సేకరణ, ఎరువుల తయారీ, స్వచ్ఛ వాహనాలపై విడివిడిగా చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే ఎక్కడా లేని విధంగా పారిశుద్ధ్యనికి పెద్ద పీట వేసి నెలలో ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం చేపట్టిన ఘనత ఆయనదేనన్నారు. అధికారులు అంకెల గారిడి లేకుండా చిత్తశుద్ధితో చెత్త సేకరణ పై దృష్టి సారించి స్వచ్ఛరథాల నిర్వహణ లోపం లేకుండా చూడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200 ప్లాస్టిక్ మేనేజ్మెంట్ యూనిట్లు, 12 వేలకు పైగా ట్రై సైకిళ్లు, 5000 స్వచ్ఛ రథాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లోని కురబలకోట, మొలకలచెరువు లలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గ్రామాలలో టాయిలెట్లు, కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మాణానికి ఎన్ని నిధులైన అందుబాటులో ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ద్వారా మంజూరు చేయించుకుని నిర్మించాలన్నారు.పంచాయతీల అభివృద్ధికి పన్నులు వసూళ్లతో పాటు గ్రామాల అభివృద్ధికి సమిష్టి కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వం పారిశుధ్యం పై నిర్లక్ష్యం వహించిందని నేడు ఎన్డీఏ పాలనలో స్వచ్ఛ ఆంధ్ర కు ప్రాధాన్యతనిచ్చి పల్లె సీమలు పర్యావరణ పరిరక్షణ తో అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. పారిశుద్ధ్యం తో పాటు తాగునీటి సమస్యలు, మౌలిక సదుపాయాలపై నాయకులు అధికారుల సమన్వయంతో అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ రాధమ్మ, డి ఎల్ పి ఓ నాగరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సతీష్ కుమార్, డి ఈ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈ వినోద్ కుమార్ ఆరు మండలాల ఎంపీడీవోలు, అన్ని శాఖల అధికారులు, అధికార పార్టీ కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన కొమ్మిరెడ్డిః రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ కొమ్మిరెడ్డి పట్టాభిరామ్ తంబళ్లపల్లెలో పురుషోత్తం ఏర్పాటుచేసిన స్వచ్ఛరథాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్వచ్ఛరథం ద్వారా సేకరించిన ప్లాస్టిక్, తడి పొడి చెత్త సేకరించి అందుకు సరిపడా సరుకుల రూపంలో ప్రజలకు అందించాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సహకరించాలని సూచించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :