నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 19 : తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్లో గత మూడేళ్లుగా పనిచేసిన నలుగురు పోలీసులు చేసిన సేవ అభినందనీయమని ఎస్సై టి అనిల్ కుమార్ ప్రశంసించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న పోలీసులు లక్ష్మీనారాయణ, శివ శంకర్ రెడ్డి, వెంకటేష్, రాఘవేంద్ర లను ఆదివారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతల్లో ట్రాన్స్ఫర్లు సర్వసాధారణమని మనం చేసిన సేవే గుర్తింపు నిస్తుందని ఎక్కడ పని చేసినా అంకితభావంతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ట్రాన్స్ఫర్ అయిన పోలీసులు ఎస్సై అనిల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది జమీల్ బాషా, శ్రీనివాసులు, మంజుల, రెడ్డప్ప లు పాల్గొన్నారు
Reporter
Namitha News