నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 15 ః తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండలో మహాశివరాత్రికి స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు. ఉదయం నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కొండ కింద నుండి పైకి 37ఆర్టీసీ బస్ సర్వీసులు, మదనపల్లి, ములకలచెరువు, పెద్దమండెం, బి కొత్తకోట నుండి బస్ సర్వీసులు నడిచాయి. మలికి మధుసూదన్ రెడ్డి ఉచిత బస్సు సర్వీస్ లుఏర్పాటు చేశారు. కొండపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈవో మునిరాజా సారథంలో భక్తులకు క్యూలైన్లు, దర్శనం, ఆలయంలో అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వామి స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలి రావడంతో మల్లయ్య కొండ కిటకిటలాడింది. మల్లయ్య కొండకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్, బిజెపి సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి, టిడిపి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, సీడ్ మల్లికార్జున నాయుడు, పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు పొందారు
Reporter
Namitha News