నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 14 : మదనపల్లె సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు మైభారత్ అన్నమయ్య సంస్థ వారి ఆధ్వర్యంలో డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 135 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, యెన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ పి.రాజేష్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సామాజికంగా దేశ పురోగతికి మార్గదర్శనం చేసిన మహనీయుడు మన అంబెడ్కర్ అని తెలిపారు. ఇప్పటికీ ఆయన రచించిన రాజ్యాంగమే దేశానికి దిక్సూచి అని, ఆయన సూచించిన మార్గాలే పాలకులకు మార్గదర్శకాలు అని, ఆయన ఆలోచనల నుంచి జాలువారిన నిర్ణయాలు, ప్రతిపాదనలు సమాజ ప్రగతికి సోపానాలుగా నిలిచాయి అన్నారు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన గొప్పదనాన్ని నెమరేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా యువత తరాలు ఆయన ఆశయాలను ఆకళింపు చేసుకుని, సమానత్వం, బౌద్ధికత, మానవత్వం వంటి విలువలను తమ జీవితాల్లో అనుసరించాలి. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, సమాజంలో మార్పు తీసుకురావడానికి మనమందరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో యన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ రాజేష్, యన్.సి.సి 11 ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి మరియు యన్.ఎస్.ఎస్. మరియు యన్.సి.సి విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News