Wednesday, 29 July 2026 08:17:25 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

అనారోగ్యంతో కానిస్టేబుల్ గండి వెంకటేశ్వర్లు మృతి

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 07 July 2026 04:47 PM Views : 85

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అనారోగ్యంతో కానిస్టేబుల్ మృతి.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి టి.సుండుపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గండి వెంకటేశ్వర్లు (46) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఆయన గత 15 ఏళ్లుగా కడప, అన్నమయ్య జిల్లాల్లో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఆయనకు భార్య ప్రమీల, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వెంకటేశ్వర్లు మృతిపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సమర్థుడైన కానిస్టేబుల్‌ను కోల్పోవడం పోలీస్ శాఖకు తీరని లోటని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు మృతుని నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. దహన సంస్కారాల తక్షణ ఖర్చుల కోసం ఎస్పీ తరఫున రూ.1 లక్ష నగదును మృతుని సతీమణి ప్రమీలకు అందజేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంగళవారం రాయచోటి మండలం మాసాపేట రెడ్డివారిపల్లి గ్రామంలో వెంకటేశ్వర్లు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఏఆర్ పోలీసు బృందం గాలిలోకి కాల్పులు జరిపి 'గార్డ్ ఆఫ్ ఆనర్'తో కడసారి గౌరవ వందనం సమర్పించింది. అంతిమయాత్రలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :