నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 07 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార కార్యక్రమం ద్వారా మండలంలోని సాగునీటి వనరుల మరమ్మత్తులతో సాగునీటి వనరులకు మహర్దశ పట్టనునట్లు ఏపీవో అంజనప్ప తెలిపారు. మంగళవారం ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఇరిగేషన్ ఏఈ సతీష్ ఆధ్వర్యంలో కోసువారిపల్లె, బాలిరెడ్డిగారి పల్లె పంచాయతీలలోని చెరువులు, కుంటలు, సాగునీటి వనరులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జలధార కార్యక్రమంలో మైనర్ ఇరిగేషన్ చెరువులు, కుంటలు, చెక్ డ్యాములలో జంగిల్ క్లీనింగ్, చెరువు కట్టలు, మొరవలు పటిష్టం, కాలవలు పూడికతీత, మరమ్మత్తు పనులు, నీటి సంరక్షణ పనులు చేపట్టడానికి సంబంధిత అధికారులకు నివేదికలు పంపనున్నట్లు ఏపీవో విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈసీ మహేష్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పవన్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు వేమనారాయణ, శ్రీకాంత్ రెడ్డి రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News