నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 18 : తంబళ్లపల్లె మోడల్ స్కూల్ లోని ప్రతి టెన్త్ క్లాస్ విద్యార్థి 580 పైగా మార్కులు సాధించే లక్ష్యంతో పట్టుదలతో చదవాలని స్పెషల్ ఆఫీసర్ డిఎల్డిఓ అమరనాథరెడ్డి సూచించారు. బుధవారం ఆయన టెన్త్ విద్యార్థుల విద్యా విధానంపై విద్యార్థులతో ముఖాముఖి అడిగి తెలుసుకుని సంతృప్తి చెందారు. విద్యార్థులు తమ సమస్యల నివృత్తికి ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. టెన్త్ లో సత్ఫలితాలు సాధించి తద్వారా ఉన్నత విద్య లో రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితబోధ చేశారు. ఆయన వెంట ఎంఈఓ త్యాగరాజు, ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News