నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 10 : తంబళ్లపల్లె మండలంలో ఉపాధి హామీ పథకంలో హార్టికల్చర్ కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత నివ్వాలని ఏపీ డి చందన సూచించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన క్షేత్ర సహాయకులు సమీక్షలో ఆమె మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న జలధార, జలహారతి పనులు త్వరగా పూర్తి చేసి ప్రతి సాగునీటి చెరువులు నీటితో కళకళలాడాలని సూచించారు. ఉపాధి హామీలు హార్టికల్చర్ లో భాగంగా ప్రకృతి వ్యవసాయం తో రైతులు కోరిన పండ్ల మొక్కల పెంపకానికి రైతులతో మాట్లాడి ఒప్పించాలన్నారు. మండలంలో మొదటి ప్రాధాన్యత క్రమంలో 200 ఎకరాలలో పండ్ల మొక్కల పెంపకానికి క్షేత్ర సహాయకులు కృషి చేయాలన్నారు. మండలంలో జలధార, జలహారతి కార్యక్రమంలో జరిగే ప్రతి పని ప్రతి నీటి బొట్టు సంరక్షణే ధ్యేయంగా పనులు చేయించాలన్నారు. ఎంపీడీవో ఎంవి ప్రసాద్ మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న జలధార,జలహారతి పనుల నిర్వహణ పై అభినందిస్తూ మిగిలిన పనులు పూర్తిచేసి జల సంరక్షణకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సుజాత, బాల గంగాధర్, భూదేవి, కంప్యూటర్ ఆపరేటర్లు రమేష్, సరస్వతి, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News