నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 16 : మున్సిపాలిటీలు, మండలాలు, మేజర్ పంచాయతీ లలో అనధికార లేఔట్లు, ఫ్లాట్ల క్రమబద్ధీకరణ ప్రతి ఒక్కరికి ఓ సువర్ణ అవకాశమని పలమనేరు - కుప్పం - మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సురేష్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం గతంలో అనధికార లేఔట్లు సమస్యలపై ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి, పేద ప్రజలకు భవిష్యత్తులో ప్లాట్ల విషయమై ఇబ్బందులు లేకుండా క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 23 లోపు లేఔట్లకు 14 శాతం ఓపెన్ ఖరీదులో 50% మినాయింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. లేఔట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరణతో భవిష్యత్తులో ఏ విధమైన ఇతర అదనపు చార్జీలు లేకుండా భవనాలకు అనుమతి, ప్లాన్ అనుమతితో బ్యాంకు రుణ అవకాశం, న్యాయబద్ధంగా తన స్థలము అమ్ముకునే వెసులుబాటు, చట్టబద్ధంగా స్థలానికి భద్రత ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది 23 వ తేదీ లోపు దరఖాస్తు చేయని అనధికార లేవట్ల స్థలాల యందు భవిష్యత్తులో ఎలాంటి భవనాలకు అనుమతులు ఉండవని అలా నిర్మించిన చట్టపరమైన చర్యలు చేపట్టి కూల్చివేయడం జరుగుతుందన్నారు. దీంతోపాటు అమ్మకం కొనుగోలు వీలు లేకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో నిషేధం అమలు పరుస్తామన్నారు. ఈ అవకాశాన్ని మధ్యతరగతి, నిరుపేద, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ,లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి తంబళ్లపల్లె సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడు, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, పి కే యం యు డి ఎ సెక్రటరీ మనోహర్, ఏఎస్ఐ నజీర్ భాష,టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, కుప్పం సింగల్ విండో అధ్యక్షుడు రఫీ, రవిచంద్ర బాబు, టిడిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, డేరంగులచంద్ర, పురుషోత్తం , వీఆర్వో నాగరాజు, కార్యదర్శి శ్రీనివాసరావు, రెవిన్యూ, మండల పరిషత్ అధికారులు,మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News