Monday, 08 June 2026 10:02:03 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

మిట్స్ యూనివర్సిటీ లో జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం ఎపిక్స్-2K26

Date : 26 February 2026 07:30 PM Views : 261

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లి -ఫిబ్రవరి 26 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగం వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం ఎపిక్స్-2K26 (ఎపిచ్స్-2026) ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ యాశ్పాల్, సీనియర్ మేనేజర్, ఏ.టి&టి కంపెనీ, బెంగళూరు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ దాడుల పెరుగుదల, డేటా భద్రత, ఆన్‌లైన్ మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి అని అన్నారు. నకిలీ ఈమెయిల్లు, బ్యాంక్ లేదా కంపెనీల పేరుతో వచ్చే లింకులు ద్వారా వినియోగదారుల పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు దొంగిలించడం జరుగుతోంది. సైబర్ నేరగాళ్లు ఏమాత్రం అనుమానం రాకుండా ప్రజల ఖాతాల నుంచి డబ్బును ఊహించలేని విధంగా దోచేస్తున్నారని ఆయన అన్నారు. ఆధునిక సైబర్ మాయాజాలంతో సామాన్యులనే కాకుండా ప్రముఖుల్నీ సైతం మోసం చేస్తున్న అనేక ఘటనలు ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్నాయని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ వివిధ రకాల ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజల్లో సైబర్ భద్రతపై విస్తృత అవగాహన అవసరమని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత సమాచారం రక్షణ, పాస్‌వర్డ్ భద్రత, రెండు-దశల ధృవీకరణ, సురక్షిత బ్రౌజింగ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్న ఉద్యోగావకాశాలు, ఎథికల్ హ్యాకింగ్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ భద్రతకు ఉన్న అవసరం మరింత పెరుగుతోందని, పరిశ్రమ అవసరాలకు తగినట్లు విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. కార్యకమం లో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ బి.పెరిసిస్ అర్బన, ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్స్ డాక్టర్ సచికంఠ దాస్ , అసిస్టెంట్ ప్రొఫెసర్ రోని దాస్, శ్రీ లక్ష్మి ప్రీతీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :