Monday, 14 September 2026 10:11:40 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ యూనివర్సిటీ లో జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం ఎపిక్స్-2K26

Date : 26 February 2026 07:30 PM Views : 348

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లి -ఫిబ్రవరి 26 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగం వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం ఎపిక్స్-2K26 (ఎపిచ్స్-2026) ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ యాశ్పాల్, సీనియర్ మేనేజర్, ఏ.టి&టి కంపెనీ, బెంగళూరు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ దాడుల పెరుగుదల, డేటా భద్రత, ఆన్‌లైన్ మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి అని అన్నారు. నకిలీ ఈమెయిల్లు, బ్యాంక్ లేదా కంపెనీల పేరుతో వచ్చే లింకులు ద్వారా వినియోగదారుల పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు దొంగిలించడం జరుగుతోంది. సైబర్ నేరగాళ్లు ఏమాత్రం అనుమానం రాకుండా ప్రజల ఖాతాల నుంచి డబ్బును ఊహించలేని విధంగా దోచేస్తున్నారని ఆయన అన్నారు. ఆధునిక సైబర్ మాయాజాలంతో సామాన్యులనే కాకుండా ప్రముఖుల్నీ సైతం మోసం చేస్తున్న అనేక ఘటనలు ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్నాయని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ వివిధ రకాల ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజల్లో సైబర్ భద్రతపై విస్తృత అవగాహన అవసరమని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత సమాచారం రక్షణ, పాస్‌వర్డ్ భద్రత, రెండు-దశల ధృవీకరణ, సురక్షిత బ్రౌజింగ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్న ఉద్యోగావకాశాలు, ఎథికల్ హ్యాకింగ్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ భద్రతకు ఉన్న అవసరం మరింత పెరుగుతోందని, పరిశ్రమ అవసరాలకు తగినట్లు విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. కార్యకమం లో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ బి.పెరిసిస్ అర్బన, ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్స్ డాక్టర్ సచికంఠ దాస్ , అసిస్టెంట్ ప్రొఫెసర్ రోని దాస్, శ్రీ లక్ష్మి ప్రీతీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :