నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 03 : రామసముద్రం మండలం చెంబకూరు గ్రామపంచాయతీ కేంద్రంలోని రైతుసేవా కేంద్రంలో బుధవారం వ్యవసాయ అధికారి అహ్మద్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతన్న మీకోసం ప్రజావేదిక లైవ్ టెలికాన్ఫెరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న రైతన్నలు. ఈ సందర్భంగా రైతులకు పంట మార్పిడి ద్వారా లాభసాటి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, భూసార పరీక్షలు, సాంకేతిక పద్ధతి ద్వారా వ్యవసాయం చేయడం, ప్రభుత్వం రైతులకు వ్యవసాయానికి అందిస్తున్న పరికరాలు, వ్యవసాయ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం కల్పించారు. అలాగే రైతుల సమస్యలకు ప్రణాళికలు రూపొందించి ఉన్నత అధికారులకు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది చందన, అనూష,రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News