నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 25 : తంబళ్లపల్లె మండలం లో విబిజీ రాంజీ పథకంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించాలని జిల్లా డ్వామా పిడి వెంకటరత్నం ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండలంలోని మర్రిమాకుల పల్లె పంచాయతీలోని తాతిరెడ్డి చెరువులో జరుగుతున్న పూడిక తీత పనులను పరిశీలించి ఉపాధి హామీ సిబ్బందితోపాటు కూలీలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ఎల్ నినో ప్రభావంతో వర్ష బావం ఏర్పడిందని ఈ సమస్యను అధిగమించడానికి జల సంరక్షణ పనులు విరివిగా చేపట్టాలన్నారు. చెరువుల్లో పూడికతీత పనులు ముమ్మరం చేసి భవిష్యత్తులో చెరువులు నీటితో నిల్వ ఉండడానికి ఆస్కారం ఉందన్నారు. అదేవిధంగా పశుగ్రాసం కొరత అధిగమించడానికి వాడు రైతులకు గడ్డి పెంపకానికి అవగాహన కల్పించాలని సూచించారు. సాగునీరు కలిగిన రైతులకు పండ్ల తోటలు పెంపకం పై దృష్టి సారించేలా చొరవ చూపాలన్నారు. వి బి జి రామ్ జి ఉపాధి పనులలో కూలీలు ముమ్మరంగా పాల్గొనాలని వారికి సకాలంలో బిల్లులు చెల్లింపు జరుగుతుందని సూచించారు. మండలంలో జరుగుతున్న వి బి జి రాంజీ ఉపాధి పనుల నిర్వహణపై మండల స్థాయి ఉపాధి అధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణలో ఫీల్డ్ అసిస్టెంట్ల సహకారంతో పనులు ముమ్మరంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టిఎంసి లక్ష్మీనారాయణ, టెక్నికల్ అసిస్టెంట్ సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహులు, కూలీలు పాల్గొన్నారు
Reporter
Namitha News