నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాష్ట్రంలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "తల్లికి వందనం" పథకంతో పాటు అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) అన్నమయ్య జిల్లా కార్యదర్శి దేవా, ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా మదనపల్లి మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు మస్తాన్ మాట్లాడుతూ డైలీ వెజ్ కార్మికులకు ఐదు నెలల పది రోజులు జీతాలు చెల్లించలేదు అధికారులు నిర్లక్ష్యం వల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు జీతాలు లేనందువలన 53 మంది కార్మికులు ఉండగా జీతాలు లేనందున 30 మంది కార్మికులు పనిచేస్తున్నారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఎండా-వానా, పండుగలు అనే తేడా లేకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని వారు పేర్కొన్నారు. అయినప్పటికీ అధిక శాతం మంది కార్మికులు తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల పిల్లల విద్య, కుటుంబ సంక్షేమం, జీవన భద్రతను దృష్టిలో ఉంచుకుని "తల్లికి వందనం" పథకాన్ని అర్హులైన ప్రతి మున్సిపల్ కార్మిక కుటుంబానికి వర్తింపజేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలు వారికి అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పథకాల అమలులో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మున్సిపల్ కార్మికుల కోసం ప్రత్యేక నమోదు, అవగాహన శిబిరాలు నిర్వహించి అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రభుత్వం గుర్తించి వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయంలో జిల్లా పరిపాలన తక్షణ చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యస్. మస్తాన్ బి.తిరుమలప్ప జానకి లోకేష్ మళ్లీ అల్లా బక్షు శివ తదిరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News