Sunday, 13 September 2026 08:54:26 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి

Date : 20 July 2026 03:42 PM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాష్ట్రంలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "తల్లికి వందనం" పథకంతో పాటు అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) అన్నమయ్య జిల్లా కార్యదర్శి దేవా, ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా మదనపల్లి మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు మస్తాన్ మాట్లాడుతూ డైలీ వెజ్ కార్మికులకు ఐదు నెలల పది రోజులు జీతాలు చెల్లించలేదు అధికారులు నిర్లక్ష్యం వల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు జీతాలు లేనందువలన 53 మంది కార్మికులు ఉండగా జీతాలు లేనందున 30 మంది కార్మికులు పనిచేస్తున్నారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఎండా-వానా, పండుగలు అనే తేడా లేకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని వారు పేర్కొన్నారు. అయినప్పటికీ అధిక శాతం మంది కార్మికులు తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల పిల్లల విద్య, కుటుంబ సంక్షేమం, జీవన భద్రతను దృష్టిలో ఉంచుకుని "తల్లికి వందనం" పథకాన్ని అర్హులైన ప్రతి మున్సిపల్ కార్మిక కుటుంబానికి వర్తింపజేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలు వారికి అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పథకాల అమలులో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మున్సిపల్ కార్మికుల కోసం ప్రత్యేక నమోదు, అవగాహన శిబిరాలు నిర్వహించి అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రభుత్వం గుర్తించి వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయంలో జిల్లా పరిపాలన తక్షణ చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యస్. మస్తాన్ బి.తిరుమలప్ప జానకి లోకేష్ మళ్లీ అల్లా బక్షు శివ తదిరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :