Monday, 08 June 2026 09:51:51 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

మిట్స్ యూనివర్సిటీ లో సైబర్ నేరాలు, అరికట్టే పద్ధతులు పై చర్చలు, పరస్పర ఒప్పందాలు

ముఖ్య అతిధిగా చెన్నైకి చెందిన హ్యాకర్స్ ఇన్ఫోటెక్, ఫౌండర్ అండ్ సీఈఓ చంద్రప్రకాష్ శంకర్

Date : 06 November 2025 07:25 PM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 06 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ ) విభాగం వారు ఐఐఐసి వారి ఆధ్వర్యంలో ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అనే అంశం పై హాండ్స్ ఆన్ వర్కుషాప్ ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెన్నైకి చెందిన హ్యాకర్స్ ఇన్ఫోటెక్, ఫౌండర్ అండ్ సీఈఓ చంద్రప్రకాష్ శంకర్, డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్రప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ గంగాదేవి, డాక్టర్ మణికందన్ మరియు ఎమ్.శ్రీ లక్ష్మి ప్రీతీ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి చంద్రప్రకాష్ శంకర్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్ లో వ్యాపారాలు మరియు వ్యక్తులకు సంబంధించిన వివరాలు ఎన్నో ఉన్నాయని, వీటిని లక్ష్యంగా చేసుకుని రోజు రోజు కు సైబర్ దాడులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. పెరుగుతున్న సైబర్ దాడులకు, సున్నితమైన డేటాను రక్షించడానికి మరియు సైబర్ ప్రమాదాలను తగ్గించడానికి అవసరమైన ఆధునిక టెక్నాలజీలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, ముక్యంగా సమస్యను అర్థం చేసుకొని వాటికి పరిష్కరాలను చేసేలా విద్యార్థులు ఎదగాలని ఆయన అన్నారు. డేటా ఉల్లంఘనలకు మానవ తప్పిదం ప్రధాన కారణం అని, సోషల్ ఇంజనీరింగ్ స్కామ్‌లు మరింత అధునాతనంగా మారాయి అని ఆయన అన్నారు. సైబర్ దాడులు, డేటా లీక్‌లు, ఫిషింగ్, మాల్వేర్ వంటి ముప్పులను గుర్తించడం, వాటికి సమయానుకూలంగా స్పందించడం మరియు వాటిని అరికట్టే పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలకు ప్రభావితమైన సిస్టమ్‌లను నెట్‌వర్క్ నుండి వేరుచేయడం లేదా తాత్కాలికంగా మూసివేయడం వంటి చర్యలు తీసుకోవాలని అన్నారు. కృత్రిమ మేధస్సు సైబర్‌ సెక్యూరిటీ రంగంలో సమయానుకూల ప్రతిస్పందన, ముప్పుల ముందస్తు గుర్తింపు మరియు డిజిటల్‌ భద్రత బలోపేతం చేయడంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది అని తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీలుగా పరస్పర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :