Monday, 14 September 2026 08:23:43 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ యూనివర్సిటీ లో సైబర్ నేరాలు, అరికట్టే పద్ధతులు పై చర్చలు, పరస్పర ఒప్పందాలు

ముఖ్య అతిధిగా చెన్నైకి చెందిన హ్యాకర్స్ ఇన్ఫోటెక్, ఫౌండర్ అండ్ సీఈఓ చంద్రప్రకాష్ శంకర్

Date : 06 November 2025 07:25 PM Views : 258

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 06 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ ) విభాగం వారు ఐఐఐసి వారి ఆధ్వర్యంలో ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అనే అంశం పై హాండ్స్ ఆన్ వర్కుషాప్ ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెన్నైకి చెందిన హ్యాకర్స్ ఇన్ఫోటెక్, ఫౌండర్ అండ్ సీఈఓ చంద్రప్రకాష్ శంకర్, డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్రప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ గంగాదేవి, డాక్టర్ మణికందన్ మరియు ఎమ్.శ్రీ లక్ష్మి ప్రీతీ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి చంద్రప్రకాష్ శంకర్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్ లో వ్యాపారాలు మరియు వ్యక్తులకు సంబంధించిన వివరాలు ఎన్నో ఉన్నాయని, వీటిని లక్ష్యంగా చేసుకుని రోజు రోజు కు సైబర్ దాడులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. పెరుగుతున్న సైబర్ దాడులకు, సున్నితమైన డేటాను రక్షించడానికి మరియు సైబర్ ప్రమాదాలను తగ్గించడానికి అవసరమైన ఆధునిక టెక్నాలజీలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, ముక్యంగా సమస్యను అర్థం చేసుకొని వాటికి పరిష్కరాలను చేసేలా విద్యార్థులు ఎదగాలని ఆయన అన్నారు. డేటా ఉల్లంఘనలకు మానవ తప్పిదం ప్రధాన కారణం అని, సోషల్ ఇంజనీరింగ్ స్కామ్‌లు మరింత అధునాతనంగా మారాయి అని ఆయన అన్నారు. సైబర్ దాడులు, డేటా లీక్‌లు, ఫిషింగ్, మాల్వేర్ వంటి ముప్పులను గుర్తించడం, వాటికి సమయానుకూలంగా స్పందించడం మరియు వాటిని అరికట్టే పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలకు ప్రభావితమైన సిస్టమ్‌లను నెట్‌వర్క్ నుండి వేరుచేయడం లేదా తాత్కాలికంగా మూసివేయడం వంటి చర్యలు తీసుకోవాలని అన్నారు. కృత్రిమ మేధస్సు సైబర్‌ సెక్యూరిటీ రంగంలో సమయానుకూల ప్రతిస్పందన, ముప్పుల ముందస్తు గుర్తింపు మరియు డిజిటల్‌ భద్రత బలోపేతం చేయడంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది అని తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీలుగా పరస్పర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :