నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 06 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ ) విభాగం వారు ఐఐఐసి వారి ఆధ్వర్యంలో ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అనే అంశం పై హాండ్స్ ఆన్ వర్కుషాప్ ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెన్నైకి చెందిన హ్యాకర్స్ ఇన్ఫోటెక్, ఫౌండర్ అండ్ సీఈఓ చంద్రప్రకాష్ శంకర్, డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్రప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ గంగాదేవి, డాక్టర్ మణికందన్ మరియు ఎమ్.శ్రీ లక్ష్మి ప్రీతీ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి చంద్రప్రకాష్ శంకర్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్ లో వ్యాపారాలు మరియు వ్యక్తులకు సంబంధించిన వివరాలు ఎన్నో ఉన్నాయని, వీటిని లక్ష్యంగా చేసుకుని రోజు రోజు కు సైబర్ దాడులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. పెరుగుతున్న సైబర్ దాడులకు, సున్నితమైన డేటాను రక్షించడానికి మరియు సైబర్ ప్రమాదాలను తగ్గించడానికి అవసరమైన ఆధునిక టెక్నాలజీలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, ముక్యంగా సమస్యను అర్థం చేసుకొని వాటికి పరిష్కరాలను చేసేలా విద్యార్థులు ఎదగాలని ఆయన అన్నారు. డేటా ఉల్లంఘనలకు మానవ తప్పిదం ప్రధాన కారణం అని, సోషల్ ఇంజనీరింగ్ స్కామ్లు మరింత అధునాతనంగా మారాయి అని ఆయన అన్నారు. సైబర్ దాడులు, డేటా లీక్లు, ఫిషింగ్, మాల్వేర్ వంటి ముప్పులను గుర్తించడం, వాటికి సమయానుకూలంగా స్పందించడం మరియు వాటిని అరికట్టే పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలకు ప్రభావితమైన సిస్టమ్లను నెట్వర్క్ నుండి వేరుచేయడం లేదా తాత్కాలికంగా మూసివేయడం వంటి చర్యలు తీసుకోవాలని అన్నారు. కృత్రిమ మేధస్సు సైబర్ సెక్యూరిటీ రంగంలో సమయానుకూల ప్రతిస్పందన, ముప్పుల ముందస్తు గుర్తింపు మరియు డిజిటల్ భద్రత బలోపేతం చేయడంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది అని తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీలుగా పరస్పర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News