నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 10 : అంగళ్ళు సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు అధునాతన సైబర్ సెక్యూరిటీ మరియు ఎథికల్ హ్యాకింగ్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మదనపల్లి కి చెందిన మిట్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి మరియు ఫ్రీలాన్స్ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ కుప్పం జోహారి పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న డిజిటల్ పరివర్తన ఆధిపత్యంలో సైబర్ భద్రత యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందని, ప్రతి ఒక్కరి వ్యక్తిగత డేటా ఉల్లంఘనల నుండి పెద్ద ఎత్తున కార్పొరేట్ దాడుల వరకు, సైబర్ బెదిరింపులు వ్యక్తులు, వ్యాపారాలు మరియు ప్రభుత్వాలకు ఒకేలాగా మారాయి అని అన్నారు. ఈ బెదిరింపుల యొక్క చిక్కులను గ్రహించడానికి,లైవ్ హ్యాకింగ్ ఇన్ యాక్షన్ కి సాక్ష్యమివ్వడం కంటే మెరుగైన మార్గం లేదు అని అన్నారు. సైబర్ బెదిరింపులు సిస్టమ్లు, నెట్వర్క్లు మరియు అప్లికేషన్లలోని బలహీనతలును ఉపయోగించుకునే అనేక రకాల హానికరమైన కార్యకలాపాలను కలిగి ఉంటాయి అని, ఈ బెదిరింపులు తరచుగా సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం, కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం మొదలైనవి లక్ష్యంగా ఉంటాయి అని అన్నారు. ఫిషింగ్ దాడులు, మాల్వేర్, వైరస్లు మరియు మ్యాన్-ఇన్-ది-మిడిల్ అటాక్స్ వంటి వాటిని బర్ఫ్ సూట్ టూల్ మరియు ట్రైహ్యాక్ మీ ఫ్లాట్ ఫామ్ వంటి సాధనాలను ఉపయోగించి సైబర్ మరియు హ్యాకింగ్ దాడులను ఎలా ఎదుర్కోవాలో యూనివర్సిటీ నందు శిక్షణా తరగతులను నిర్వహించి, వీటి పై విద్యార్థులు అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రపంచ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంస పత్రాలను మరియు నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ కె. దినేష్, కోఆర్డినేటర్స్ ఎన్. జున్నుబాబు, ఎన్.సాయి కిరణ్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Admin
Namitha News