నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -మార్చి 24 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అశ్వ్ 2026 - జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ ను బుధవారం ప్రారంభించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సుల్లేర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమం లో సినీ ప్రముఖులు పాల్గొంటారని ఆయన అన్నారు. దేశ నలుమూలల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇందులూ పాల్గొంటారని ఆయనన్నారు. ముక్యంగా 25వ తేదీ న బుధవారం రోజున రాకాస మూవీ ప్రముఖులు అయిన సంగీత్ శోభన్, నిహారిక కొణిదల, హీరోయిన్ నయన్ సారిక, యాక్టర్ గెటప్ శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ మరియు డైరెక్టర్ మానస శర్మ పాల్గొంటారని ఆయన అన్నారు. వీరితో పాటు సింగర్స్ సాగర్, లిప్సిక మరియు మౌనిక లు పాల్గొంటారని ఆయన అన్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చని ఆయన అన్నారు. 26 వ తేదీన హీరో శర్వానంద్ మరియు జబర్దస్త్ టీం సదామ్ పాల్గొంటారని ఆయన అన్నారు
Admin
Namitha News