నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 29 : మొలకలచెరువు పోలీస్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలపై విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని మొలకలచెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి హెచ్చరించారు. శుక్రవారం ఆయన తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్ తనిఖీ నిర్వహించి రికార్డులు పరిశీలించి స్టేషన్ పరిధిలో ఎస్సై తో పాటు సిబ్బంది శాంతి భద్రతలపై చేస్తున్న అవగాహన, అసాంఘిక కార్యకలాపాలపై చేపట్టిన కార్యక్రమాల నిర్వహణపై అభినందించి ప్రోత్సహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పి సూచనలతో గంజాయి, మత్తు పదార్థాలపై నిఘా పెంచామని ఎక్కడైనా గంజాయి సరఫరా జరిగితే మా దృష్టికి తేవాలని సూచించారు. జూదం, కోడిపందాలు, క్రికెట్ బెట్టింగులు, ఆన్లైన్ మోసాల పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. రౌడీషీటర్ల కు ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చి సత్ప్రవర్తన కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు మారుమూల గ్రామాలలో గ్రామలలో ప్రజలకు అసాంఘిక చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి నేర రహిత సమాజం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఎస్సై అనిల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News