నమిత న్యూస్ - Andhra Pradesh / Konaseema : మదనపల్లె - నవంబర్ 23 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం వారు ఐఈఈఈ ((Institute of Electrical and Electronics Engineers) ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్) కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో "వైర్లెస్ కనెక్టివిటీలో పురోగతి: టెక్నాలజీస్, సిస్టమ్స్ మరియు నెట్వర్క్ ఎవల్యూషన్" (Advances in Wireless Connectivity: Technologies, Systems and Network Evolution) అనే అంశంపై డిసెంబర్ 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు వర్క్షాప్ నిర్వహించనునట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ వర్క్షాప్ కు ఐఈఈఈ కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారి 5000 యూస్ డాలర్స్ (4, 48, 120 రూపాయలు) ను ఫండ్ ను నిధుల రూపం లో మంజూరు చేసినట్లు ఆయన అన్నారు. ఐఈఈఈ కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారి ఈ వర్క్షాప్ ను అంతర్జాతీయ స్థాయిలో ఐఈఈఈ మెంబెర్ షిప్ కలిగిన ఇంజనీరింగ్ విద్యార్థులకు వైర్లెస్ కమ్యూనికేషన్ రంగంలో తాజా మార్పులు, అభివృద్ధులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్ సిస్టమ్ల పరిణామం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. కన్వీనర్లు డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ సి.కుమార్, కోఆర్డినేటర్స్ డాక్టర్ అరవింద రాజ్, డాక్టర్ జి.నాగాశ్వేత మరియు జి.సుబ్బారావు వ్యవహరిస్తారని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ఐఈఈఈ కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారికి యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఛాన్సలర్ డాక్టర్. సి. యువరాజ్ మరియు రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ లు ధన్యవాదాలు తెలియజేసారు.
Reporter
Namitha News