Monday, 08 June 2026 09:53:35 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో వైర్‌లెస్ కనెక్టివిటీలో పురోగతి,టెక్నాలజీస్, సిస్టమ్స్ నెట్‌వర్క్ ఎవల్యూషన్ పై వర్క్ షాప్

డిసెంబర్ 8వ తేదీ నుండీ 10వరకూ వర్క్ షాప్

Date : 23 November 2025 10:32 PM Views : 115

నమిత న్యూస్ - Andhra Pradesh / Konaseema : మదనపల్లె - నవంబర్ 23 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం వారు ఐఈఈఈ ((Institute of Electrical and Electronics Engineers) ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్) కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో "వైర్‌లెస్ కనెక్టివిటీలో పురోగతి: టెక్నాలజీస్, సిస్టమ్స్ మరియు నెట్‌వర్క్ ఎవల్యూషన్" (Advances in Wireless Connectivity: Technologies, Systems and Network Evolution) అనే అంశంపై డిసెంబర్ 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు వర్క్‌షాప్ నిర్వహించనునట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ వర్క్షాప్ కు ఐఈఈఈ కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారి 5000 యూస్ డాలర్స్ (4, 48, 120 రూపాయలు) ను ఫండ్ ను నిధుల రూపం లో మంజూరు చేసినట్లు ఆయన అన్నారు. ఐఈఈఈ కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారి ఈ వర్క్షాప్ ను అంతర్జాతీయ స్థాయిలో ఐఈఈఈ మెంబెర్ షిప్ కలిగిన ఇంజనీరింగ్ విద్యార్థులకు వైర్లెస్ కమ్యూనికేషన్ రంగంలో తాజా మార్పులు, అభివృద్ధులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ సిస్టమ్‌ల పరిణామం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. కన్వీనర్లు డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ సి.కుమార్, కోఆర్డినేటర్స్ డాక్టర్ అరవింద రాజ్, డాక్టర్ జి.నాగాశ్వేత మరియు జి.సుబ్బారావు వ్యవహరిస్తారని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ఐఈఈఈ కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారికి యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఛాన్సలర్ డాక్టర్. సి. యువరాజ్ మరియు రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ లు ధన్యవాదాలు తెలియజేసారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :