Thursday, 30 July 2026 04:36:06 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో వైర్‌లెస్ కనెక్టివిటీలో పురోగతి,టెక్నాలజీస్, సిస్టమ్స్ నెట్‌వర్క్ ఎవల్యూషన్ పై వర్క్ షాప్

డిసెంబర్ 8వ తేదీ నుండీ 10వరకూ వర్క్ షాప్

Date : 23 November 2025 10:32 PM Views : 150

నమిత న్యూస్ - Andhra Pradesh / Konaseema : మదనపల్లె - నవంబర్ 23 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం వారు ఐఈఈఈ ((Institute of Electrical and Electronics Engineers) ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్) కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో "వైర్‌లెస్ కనెక్టివిటీలో పురోగతి: టెక్నాలజీస్, సిస్టమ్స్ మరియు నెట్‌వర్క్ ఎవల్యూషన్" (Advances in Wireless Connectivity: Technologies, Systems and Network Evolution) అనే అంశంపై డిసెంబర్ 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు వర్క్‌షాప్ నిర్వహించనునట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ వర్క్షాప్ కు ఐఈఈఈ కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారి 5000 యూస్ డాలర్స్ (4, 48, 120 రూపాయలు) ను ఫండ్ ను నిధుల రూపం లో మంజూరు చేసినట్లు ఆయన అన్నారు. ఐఈఈఈ కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారి ఈ వర్క్షాప్ ను అంతర్జాతీయ స్థాయిలో ఐఈఈఈ మెంబెర్ షిప్ కలిగిన ఇంజనీరింగ్ విద్యార్థులకు వైర్లెస్ కమ్యూనికేషన్ రంగంలో తాజా మార్పులు, అభివృద్ధులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ సిస్టమ్‌ల పరిణామం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. కన్వీనర్లు డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ సి.కుమార్, కోఆర్డినేటర్స్ డాక్టర్ అరవింద రాజ్, డాక్టర్ జి.నాగాశ్వేత మరియు జి.సుబ్బారావు వ్యవహరిస్తారని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ఐఈఈఈ కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారికి యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఛాన్సలర్ డాక్టర్. సి. యువరాజ్ మరియు రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ లు ధన్యవాదాలు తెలియజేసారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :