Saturday, 12 September 2026 07:26:44 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ప్రాణరక్షణ కవచం.. 'హెల్మెట్

Date : 21 April 2026 06:21 PM Views : 189

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రాణరక్షణ కవచం.. 'హెల్మెట్ కలకడ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 500 హెల్మెట్ల పంపిణీ.. అవగాహన కల్పించిన పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు రక్షణ కవచంలా నిలిచే హెల్మెట్ వాడకంపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ పిలుపునిచ్చారు. సోమవారం కలకడ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'యూ కాంప్లెక్స్' వద్ద లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరై వాహనదారులకు 500 ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "ప్రతి ప్రాణం ఎంతో విలువైందని, క్షణికావేశంలో, నిర్లక్ష్యంతో జరిగే రోడ్డు ప్రమాదాల్లో యువత ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం కేవలం చలాన్ల భయంతోనో, పోలీసుల కోసమో కాకుండా.. ఇంట్లో మనకోసం ఎదురుచూసే మన కుటుంబ సభ్యుల కోసం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సామాజిక బాధ్యతతో పోలీసు శాఖ సహకారంతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని" ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ శ్రీ ఎం.ఆర్. కృష్ణమోహన్, కలకడ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మన్న, రాయచోటి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కుళాయప్ప, కలకడ ఎస్ఐ రామాంజనేయులు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, శ్రీనివాసుల రెడ్డి మరియు కలకడ పోలీసు సిబ్బంది మరియు స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :