Saturday, 12 September 2026 04:43:44 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మదనపల్లెలో ఏపీ ఈజీపీఎస్ఎస్ ప్రప్రథమ సమావేశం గ్రాండ్ సక్సెస్

Date : 14 June 2026 10:16 PM Views : 136

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెలో ఏపీ ఈజీపీఎస్ఎస్ ప్రప్రథమ సమావేశం గ్రాండ్ సక్సెస్ - రాష్ట్ర అధ్యక్షులు ఆవుల మల్లికార్జున హర్షం - రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన గిరిజన ప్రముఖులు మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణం,చిత్తూరు బస్టాండ్ సమీపంలోని టౌన్ హాల్ నందు ఆదివారం ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రథమ రౌండ్ టేబుల్ సమావేశం దిగ్విజయంగా ముగిసింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డి.ఎస్.పి వరప్రసాద్,దేవరకొండ శంకరరావు,వీరం సత్యం,నాగేంద్ర సోహనాలు,నాగేంద్ర నాయక్,బ్యాంక్ మేనేజర్ కోనయ్య,ఉపాధ్యాయుడు గోపాల్,చలపతి,కోనేటి రామంచులు,ప్రసాద్,సూర్యప్రకాష్,రమేష్,శేఖర్ రాష్ట్రంలోని ఎరుకుల,యానాది,బంజారా,ఎస్టి కులస్తులు,ప్రముఖ నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం వారి హక్కుల పరిరక్షణ కోసం ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవా సంఘం ముందుంటుందన్నారు.తమ కులాలకు చెందిన కులస్తులు,ఉద్యోగస్తులు,విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.అనర్హులకు అందజేసిన ఎస్టీ సర్టిఫికెట్లను రద్దు చేయాలని,నకిలీ గిరిజన కుల సర్టిఫికెట్లను జారీ చేస్తున్న కుల సంఘాలను రద్దు చేయాలని కోరారు.గిరిజనులకు కేటాయించిన బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులపై సమగ్రంగా విచారణ చేసి,పేద దళిత గిరిజనులకు న్యాయం చేయాలన్నారు.రాష్ట్రంలోని ఎస్టీ హాస్టల్లో గిరిజనుల విద్యార్థుల సంరక్షణ విషయమై ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని,రాష్ట్ర బడ్జెట్లో ఐటిడిఏలకు కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని విన్నవించారు.యానాది కులస్తులను ప్రభుత్వం గుర్తించాలని,వారి ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్టీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలని విన్నవించారు.రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎస్టీలకు ఒక ఎమ్మెల్యే స్థానం కేటాయించాలని,ప్రతి జిల్లాలో ఎస్టీ భవన్ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల మల్లికార్జున మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాలో ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవా సంఘం తొలి సమావేశం దిగ్విజయంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు జరుపుకుంటున్న సమస్యలను పరిష్కరించడానికి నిర్విరామ కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేసిన గిరిజన ప్రముఖులు,అతిరథ మహారథులు,గిరిజన ముద్దుబిడ్డలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానమన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :