Saturday, 18 April 2026 04:12:16 PM
# జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్ # తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత # ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం # దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ # మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం # నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువుల నింపుదలపై దృష్టి జలధార–జలహారతి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు # గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది # కురబల అభివృద్ధికి సమగ్ర కృషి # 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ # 13వేల రూ లంచం తీసుకొంటూ ఏసిబి పట్టుబడిన అబ్దుల్ రజాక్ # ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు # ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి # మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 16 April 2026 10:07 PM Views : 101

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 15: అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎర్రచందనం కేసుల పురోగతిపై ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ.... కేవలం నిందితులను అరెస్ట్ చేయడం మాత్రమే కాకుండా, వారికి కోర్టులో కచ్చితంగా శిక్ష పడేలా బలమైన సాక్ష్యాధారాలను సేకరించాలి. చార్జ్ షీట్లను గడువులోపు దాఖలు చేయాలి. సాక్షుల విచారణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిరంతరం కోర్టు వ్యవహారాలను పర్యవేక్షించాలి. గతంలో ఎర్రచందనం కేసుల్లో ఉన్న వారి కదలికలపై నిఘా ఉంచాలి. పరారీలో ఉన్న ముద్దాయిలు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారి కోసం అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారిని పట్టుకోవాలి. స్మగ్లింగ్ జరిగే ప్రధాన మార్గాలను గుర్తించి, చెక్ పోస్టుల వద్ద నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలి. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు, కోర్టు సిబ్బంది మరియు క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం.వెంకటాద్రి గారు, మదనపల్లి డిఎస్పీ బి.పావని గారు, పలువురు సీఐలు, ఎస్ఐలు మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :