నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 17: మైనర్ బాలిక అదృశ్యం పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. ఎస్సై వివరాల మేరకు రామసముద్రం మండలం జక్కనవారిపల్లె గ్రామానికి చెందిన 17 సంవత్సరాల మైనర్ బాలిక నవంబర్ 15వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో ఇంటి నుండి కనిపించకుండా పోయింది. గత రెండు రోజులుగా బాలిక ఆచూకీ తెలీయకపోవడంతో బాలిక తల్లి సోమవారం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు
Admin
Namitha News