Saturday, 12 September 2026 07:09:49 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మొరుసు కాపులు కెంపెగౌడ జయంతిని విజయవంతం చేయండి

Date : 11 July 2026 06:06 AM Views : 173

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె- జూలై 09 : మొరుసుకాపు(ఒక్కలిగ)ల ఆది పురుషుడు నాడ ప్రభు కెంపెగౌడ 517వ జయంతి ఈనెల 12న బి కొత్తకోటలో జరిగే ఉత్సవాన్ని ప్రతి మొరుసుకాపు రాజకీయాలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని మొరుసు కాపు సంఘం సభ్యులు పిలుపునిచ్చారు. గురువారం ఈ సందర్భంగా మొరుసు కాపు సంఘ సభ్యులు కెంపె గౌడ జయంతి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ ఆదివారం 10 గంటలకు బి.కొత్తకోట నగర పంచాయతీ పీటిఎం రోడ్డు రాజా ఫంక్షన్ హాల్ నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. కెంపెగౌడ వేషధారణతో గుర్రపు స్వారీ విన్యాసాలు, కోలాటాలు, చెక్క భజనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పీ.టి.యం రోడ్డు,నుండి జ్యోతి చౌక్ మీదుగా దిగువ బస్టాండ్, బైపాస్ రోడ్డు, రంగసముద్రం రోడ్డు, జ్యోతి బస్టాండ్ మీదుగా భారీ ర్యాలీతో ఏకే ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమావేశం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి బి.గోపాల్ గౌడ్, శ్రీనివాస పురం ఎమ్మెల్యే వెంకట శివారెడ్డి, కర్ణాటక రాష్ట్ర మొరుసు కాపు సంఘం కార్యదర్శి కోనపరెడ్డి హాజరవుతారన్నారు. ఈ సమావేశానికి ప్రతి మొరుసు కాపు సంఘ సభ్యుడు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: