నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 13 : మదనపల్లె సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని సెంట్రల్ లైబ్రరీ వారి ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్ మరియు అధ్యాపకులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ భారతదేశ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథన్ జయంతి సందర్బంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పుస్తక పఠనంతో పాటు డిజిటల్ లైబ్రరీలు, ఈ-బుక్స్, ఆన్లైన్ జర్నల్స్, డిజిటల్ వనరులు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక వనరులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ పుస్తకాల ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదని, పుస్తకాలు మనిషికి శాశ్వత జ్ఞానాన్ని అందించే మార్గదర్శకాలుగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు ప్రత్యేక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ పుస్తక ప్రదర్శనలో ఇంజినీరింగ్,సైన్స్, టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, మేనేజ్మెంట్, పరిశోధన తదితర విభాగాలకు సంబంధించిన జాతీయ మరియు అంతర్జాతీయ వైలీ , ఓ’రైలీ , ఓరియంట్ బ్లాక్స్వాన్, సీబీఎస్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, స్ప్రింగర్ వంటి అనేక రకాల పుస్తకాలను ప్రదర్శించారు. పుస్తక ప్రదర్శనలో డాక్టర్ యెన్ గంగిశెట్టి, లైబ్రేరియన్ డాక్టర్ ఎమ్.సురేష్ బాబు, విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News