Saturday, 12 September 2026 01:52:35 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

జాతీయ కరాటే పోటీల్లో నిమ్మనపల్లి విద్యార్థుల ప్రతిభ - కవల విద్యార్థులు బెన్షిక, బెన్షిక్‌కు ద్వితీయ స్థానం

Date : 03 August 2026 07:00 PM Views : 106

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జాతీయ కరాటే పోటీల్లో నిమ్మనపల్లి విద్యార్థుల ప్రతిభ - కవల విద్యార్థులు బెన్షిక, బెన్షిక్‌కు ద్వితీయ స్థానం నిమ్మనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (తెలుగు)లో 8వ తరగతి చదువుతున్న కవల విద్యార్థులు మనేరి బెన్షిక, మనేరి బెన్షిక్ జాతీయ స్థాయి కరాటే పోటీలలో ప్రతిభ చాటారు. గత నెల 26న బెంగళూరులో నిర్వహించిన 14 సంవత్సరాల విభాగం జాతీయ కరాటే (కటా) పోటీల్లో ఇద్దరు ద్వితీయ స్థానం సాధించి పాఠశాలకు, గ్రామానికి గౌరవం తీసుకొచ్చారు. విద్యార్థుల ఈ విజయంపై వారి తల్లిదండ్రులు మనేరి శివశంకర్, జయలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం కవల విద్యార్థులకు పాఠశాలలు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజాద్ అలీఖాన్ విద్యార్థులను అభినందిస్తూ, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సోదరులు ఇద్దరు ద్వితీయ స్థానం సాధించడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శ్రీనివాసులు, శారద, వెంకటగోపాల్, సతీష్, రెడ్డిశేఖర్, రమనప్ప, జయశ్రీ, గృహలక్ష్మి, రాజేంద్ర తదితరులు విద్యార్థులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఫోటో ఉంది 2:- విద్యార్థులను అభినందిస్తున్న పాఠశాల హెచ్ఎం అంజాద్ అలీ ఖాన్ ఉపాధ్యాయ బృందం.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :