నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మే 12 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్టూరు గ్రామంలో నేడు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.. సోమశిల జలాశయం ప్రాజెక్టు డైరెక్టర్ వేలూరు.కేశవ చౌదరి వారి సతీమణి పార్లమెంటరీ విభాగపు నాయకురాలు కేశవ రేవతి చౌదరి దంపతుల ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి జయంతి సందర్భంగా తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి కుమార్తె లీలా కైవల్యా రెడ్డి ఘనంగా స్వాగతం పలుకుతూ సత్కరించారు..మొదట కేశవ చౌదరి, రేవతి దంపతులు ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆనం లీల కైవల్యా రెడ్డి చేత ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 1001 టెంకాయల మొక్కుబడి ప్రారంభించి టెంకాయలను స్వామి వారికి సమర్పించారు.. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల మాధవి, అనంతసాగరం తెలుగుదేశం పార్టీ నేత సునీత, గ్రామ నేతలు గ్రామస్తులు తదితరులు భారీగా హాజరయ్యారు. ఆనం లీలా కైవలా రెడ్డి మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన నాగుల వెల్టూరు గ్రామ ఆంజనేయస్వామి జయంతి కార్యక్రమానికి ఆహ్వానించిన కేశవ చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కేశవ చౌదరి మాట్లాడుతూ భగవాన్ వెంకయ్య స్వామి జన్మస్థలమైన నాగుల వెల్టూరు గ్రామానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఈ గ్రామంలో ప్రతి ఏడాది హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతాయని అందులో భాగంగా నేడు నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన వారికి, కార్యక్రమానిర్వాహానకు శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతుందని అన్నారు.
Reporter
Namitha News