Monday, 08 June 2026 08:20:02 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

నాగుల వెల్టూరు లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

వేలూరు కేశవ చౌదరి, రేవతి దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్న జయంతి వేడుకల్లో లో ఆనం లీలా కైవల్య రెడ్డి

Date : 12 May 2026 05:13 PM Views : 86

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మే 12 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్టూరు గ్రామంలో నేడు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.. సోమశిల జలాశయం ప్రాజెక్టు డైరెక్టర్ వేలూరు.కేశవ చౌదరి వారి సతీమణి పార్లమెంటరీ విభాగపు నాయకురాలు కేశవ రేవతి చౌదరి దంపతుల ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి జయంతి సందర్భంగా తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి కుమార్తె లీలా కైవల్యా రెడ్డి ఘనంగా స్వాగతం పలుకుతూ సత్కరించారు..మొదట కేశవ చౌదరి, రేవతి దంపతులు ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆనం లీల కైవల్యా రెడ్డి చేత ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 1001 టెంకాయల మొక్కుబడి ప్రారంభించి టెంకాయలను స్వామి వారికి సమర్పించారు.. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల మాధవి, అనంతసాగరం తెలుగుదేశం పార్టీ నేత సునీత, గ్రామ నేతలు గ్రామస్తులు తదితరులు భారీగా హాజరయ్యారు. ఆనం లీలా కైవలా రెడ్డి మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన నాగుల వెల్టూరు గ్రామ ఆంజనేయస్వామి జయంతి కార్యక్రమానికి ఆహ్వానించిన కేశవ చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కేశవ చౌదరి మాట్లాడుతూ భగవాన్ వెంకయ్య స్వామి జన్మస్థలమైన నాగుల వెల్టూరు గ్రామానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఈ గ్రామంలో ప్రతి ఏడాది హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతాయని అందులో భాగంగా నేడు నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన వారికి, కార్యక్రమానిర్వాహానకు శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతుందని అన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :